మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ అతి భారీ స్కోరు
రీల్ స్టంట్ : 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్లోకి..కట్ చేస్తే!
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్
ఇల్లు పోయి, పిల్లలూ అదృశ్యం.. చిన్నారులు దొరికినా నరకయాతన
పవిత్ర గంగలో మూడు మునకలు : అనుభూతిని పంచుకున్న జపాన్ రాయబారి
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: వైఎస్ అవినాష్రెడ్డి
హర్ముజ్లో ఇక నో ఎంట్రీ!.. ఇరాన్ కొత్త రూట్
36000 అడుగుల ఎత్తులో హై టెన్షన్.. విమానం ఇంజిన్ షట్డౌన్!
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
మెగా డీఎస్సీలో బయటపడిన మరో భాగోతం
రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్ : నెటిజన్లు ఫిదా
కేసీఆర్పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?: మాజీ మంత్రి శైలజానాథ్
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి
కల్తీ మద్యం కాటుకు 10 మంది బలి
పిల్లలు స్మార్ట్ఫోన్లు అధికంగా వాడుతున్నారా? హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్?
Published on Sat, 12/02/2023 - 15:34
ప్రస్తుత కాలంలో ఎవరింట చూసినా పిల్లల చేతిలో స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ఐపాడ్లు ఉండవలసిందే! స్మార్ట్ఫోన్లు అధికంగా వాడుతున్న పిల్లలు కదలకుండా ఒకేచోట కూర్చొని ఉంటారు. దీనివల్ల వారు చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది.
అంతేకాదు ఫోన్ లేదా టీవీ చూస్తూ ఉంటే కాస్త ఎక్కువే తినేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం, కీళ్ల సమస్యలు, గుండె జబ్బులు వంటి వాటి బారిన పడే ప్రమాదం పెరిగిపోతుంది. వీటన్నింటి నుంచి రక్షించాలంటే పిల్లలు స్మార్ట్ఫోన్ వాడకుండా చేయాలి. అదెలాగో చూద్దాం.
- పిల్లల మనసు అద్దం లాంటిది. తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న ఇతర పెద్దలు ఏం చేస్తున్నారో చూసి అదే అలవాటు చేసుకుంటారు. కాబట్టి ఇంట్లో ఉన్న సమయంలో తల్లిదండ్రులు, ఇతర పెద్దలూ స్మార్ట్ఫోన్, లాప్టాప్ వంటివి చూడకూడదని గుర్తుంచుకోండి.
- పిల్లలకు ఫోన్ చూస్తూ తినే అలవాటు ఉంటే, వాళ్లకు ఆకలిగా ఉన్నప్పుడే అన్నం పెట్టండి. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు అల్లరి చేయరు. మొబైల్ గురించి ఆలోచించరు. తిండిపైనే ధ్యాస పెడతారు.
- మొబైల్ లేకుండా ఐదు నిమిషాల పాటు వారికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. పేచీ పెట్టకుండా సరిగ్గా తింటే, ఈ సమయాన్ని పెంచవచ్చు.
- పిల్లలకు తినిపించేటప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఉండండి. వంటకాలు ఎలా ఉన్నాయో అడగండి. నవ్వుతూ... కబుర్లు చెబుతూ, జోకులేస్తూ, సరదాగా గడిపితే మొబైల్ ఫోన్ చూపించి తిండి పెట్టాల్సిన అవసరం ఉండదు.
- చిన్నప్పటినుంచి పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. ముందు బొమ్మల పుస్తకాలతో మొదలు పెట్టండి. ఆ తర్వాత పజిల్స్ పూర్తి చేయడం, కథల పుస్తకాలు, వార్తా పత్రికలలో పిల్లలకోసం కేటాయించే కథనాలను చదవడం అలవాటు చేయడం వల్ల వారి దృష్టి స్మార్ట్ఫోన్ పైకి మళ్లదు.
- పిల్లలకు బాల్యం నుంచి చుట్టుపక్కల పిల్లలతో ఆటలు ఆడటం అలవాటు చేయాలి. వారి వయసు పిల్లలు లేకపోతే మీరే వారితో ఆడుకోండి. కాసేపు ఔట్డోర్ ఆటలు, కాసేపు చెస్, క్యారమ్స్ వంటివి ఆడటం అలవాటు చేస్తే స్మార్ట్ఫోన్ బారిన పడకుండా స్మార్ట్గా తయారవుతారు.
#
Tags : 1