Breaking News

వైకల్యాన్ని జయించి, స్పూర్తిగా నిలిచిన గీతా ఎస్‌ రావు

Published on Wed, 03/01/2023 - 17:54

ఎవరి సామర్థ్యాలేంటో వారికే తెలిసినప్పటికీ శరీరం సహకరించడం లేదనో, ఆర్థిక స్థితిగతులు బాగోలేవనో ఏదో కారణంతో వెనకడుగు వేస్తుంటారు. కానీ, 42 ఏళ్ల గీతా ఎస్‌ రావు వాటన్నింటినీ అధిగమించి తన సత్తా ఏమిటో ప్రపంచానికి చూపుతోంది. పోలియోతో బాధపడుతున్నా శ్రీనగర్‌ నుంచి కన్యాకుమారి వరకు జాతీయస్థాయిలో నేడు ప్రారంభమయ్యే లాంగెస్ట్‌ సైకిల్‌ రేస్‌లో పాల్గొనబోతోంది. ఈ సైక్లింగ్‌లో రేస్‌లో పాల్గొంటున్న ఏకైక మహిళ గీతా ఎస్‌ రావు. 

‘నేను సాధించగలను’ అనే ధీమాను తన విజయంలోనే చూపుతున్న మహిళగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంపాజిబుల్‌ అనేవారికి ఇటీజ్‌ పాజిబుల్‌ అనే సమాధానం ఇస్తుంది. నేడు శ్రీనగర్‌ నుండి ప్రారంభమై కన్యాకుమారి వరకు జరిగే 3,551 కిలోమీటర్ల లాంగ్‌ సైక్లింగ్‌ రేస్‌లో పాల్గొంటున్నది గీతా ఎస్‌ రావు. డిఫరెంట్లీ–ఏబుల్డ్‌ గానే కాదు ఇలా సైక్లింగ్‌ రేస్‌లో పాల్గొంటున్న ఏకైక మహిళగా కూడా గుర్తింపు పొందింది ఆమె.

అహ్మదాబాద్‌లో ఉంటున్న గీతకు మూడేళ్ల వయసులో పోలియో కారణంగా ఎడమ కాలు చచ్చుపడిపోయింది. గీత తల్లిదండ్రులు ఆమెను మిగతా పిల్లలమాదిరిగానే ధైర్యం నూరిపోస్తూ పెంచారు. కొన్నాళ్లు బెడ్‌కే అంకితమైపోయిన గీత ఆ తర్వాత వీల్‌ చెయిర్, హ్యాండికాప్డ్‌ బూట్స్‌తో నిలబడింది. అక్కడ నుంచి ఒక్కో మెట్టు సాధన చేస్తూ ట్రెక్కింగ్, బంగీ జంపింగ్, పారాగ్లైడింగ్, వాక్‌ త్రూ, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, మారథాన్‌.. ఇలా ఒక్కో ప్రయత్నం ఆమెను శక్తిమంతురాలిగా నిలబెట్టాయి. ఆమె తన కలలను సాకారం చేసుకోవడానికి తన సంకల్ప శక్తినే ఆయుధంగా చేసుకుంది.

పడిపోతూ.. నిలబడింది
రెండు కాళ్లూ సరిగ్గా ఉన్న సైక్లిస్టులు రోడ్డు ప్రమాదాల్లో మరణించడం చూసి చలించిపోయేది. తను సైక్లిస్ట్‌గా మారలేనా అనుకుంది. ముప్పై ఏళ్ల వయసులో సైకిల్‌ నేర్చుకునే ప్రయత్నం చేసింది. రోడ్డు మీద సైక్లింగ్‌ చేసే సమయంలోనూ చాలా సార్లు పడిపోయింది. తల నుండి కాలి వరకు గాయలయ్యాయి. కానీ, శరీరం సహకరించలేదనే నెపంతో తనకు నచ్చిన సైక్లింగ్‌ను మూలనపడేయకూడదు అనుకుంది.

తన లాంటి వారికి ప్రేరణగా నిలవాలనుకుంది. ఆ స్థైర్యమే ఆమెను పారా ఒలిపింక్‌ గేమ్స్‌ వరకు తీసుకెళ్లింది. 2016లో మొదలుపెట్టిన ఆమె సైకిల్‌ ప్రయాణం ఇప్పటికి 80 వేల కిలోమీటర్ల వరకు సాగింది. మొదట్లో 200 మీటర్లు కూడా సైకిల్‌ తొక్కలేకపోయేది. కానీ, త్వరలో పారిస్‌కు చెందిన ఆడాక్స్‌ క్లబ్‌ పర్షియన్‌ రాండెన్యుర్‌ రైడ్స్‌లో పాల్గొనబోతోంది. ఒక యేడాదిలోనే 200, 300, 400, 600 కిలోమీటర్ల రైడ్‌లను కొన్ని గంటల్లోనే సాధించింది. 

తన రికార్డులను తనే తిరగరాస్తూ..
నియమాలకు కట్టుబడి, సమయాన్ని సమర్థంగా ఉపయోగించుకుంటే వికలాంగులు కూడా సమర్థులైన వ్యక్తులుగా సమాజంలో నిలబడతారు అని తన కథనం ద్వారానే నిరూపిస్తుంది గీత. 2017 డిసెంబర్‌లో లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకుంది. భారతదేశపు మొట్టమొదటి డిఫరెంట్లీ–ఏబుల్‌ సైక్లిస్ట్‌గా పేరు సంపాదించుకుంది. 2020–21లో తన రికార్డును తనే తిరగరాసుకుంది.

ఈ యేడాది జనవరిలో వడోదర నుండి ధోలవీర వరకు వెయ్యి కిలోమీటర్ల రైడ్‌ను 73 గంటల 30 నిమిషాలలో పూర్తి చేసింది. హైదరాబాద్‌లో జరిగిన భారత జట్టు జాతీయ సెలక్షన్‌లలోనూ గీత మొదటి స్థానంలో నిలిచింది. ఆసియా ఛాంపియన్‌షిప్‌ కోసం ఆమెకు శిక్షణ ఇచ్చేందుకు స్వచ్ఛందంగా కోచ్‌లు ముందుకు వచ్చారు. 

మద్దతు కోసం 
తన కలలను సాకారం చేసుకోవడానికి గీత ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల నుండి స్పాన్సర్‌షిప్‌ కోసమూ ప్రయత్నిస్తోంది. ఈ పోరాట ప్రయాణానికి ఎంతో మంది తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా లాంగెస్ట్‌ రేస్‌లో గీత పాల్గొనడానికి హైదరాబాద్‌లోని సుహానా హెల్త్‌ ఫౌండేషన్, ధాత్రి మదర్స్‌ మిల్క్‌ బ్యాంక్‌ నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ –‘ఇది జాతీయ స్థాయిలో జరిగే అతి పెద్ద రేస్‌. విభిన్నంగా ఉండే మన దేశీయ వాతావరణంలో, సుందరమైన ప్రదేశాల మీదుగా ఈ రేస్‌ ఉంటుంది.

దేశంలోని వారే కాదు ప్రపంచంలోని మారు మూలప్రాంతాల నుంచి కూడా ఈ రేస్‌లో పాల్గొంటున్నారు. అతి ΄పొడవైన ఈ సైక్లింగ్‌ రేస్‌ 12 రోజుల్లో 12 రాష్ట్రాలను దాటాలి’ అని తెలియజేస్తుంది. సైక్లిస్ట్‌గానే కాదు గీత ట్రావెలర్‌గానూ పేరు తెచ్చుకుంది. కార్పొరేట్‌ కమ్యూనికేషన్, బిఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన గీత ఐటీ మేనేజర్‌గా ఉద్యోగమూ చేసింది. ఎంట్రప్రెన్యూర్‌గా సొంతంగా కార్పొరేట్‌ కంపెనీకి డైరెక్టర్‌గా ఉంది.

పిల్లలు సైకిల్‌ నేర్చుకునేటప్పుడు, ప్రాక్టీస్‌ చేసేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటారో గీత అంతే హుషారును చూపుతుంది. ఆ సాధన, ఆనందం ఆమెను ప్రపంచ కప్‌ సాధించే దిశగా తీసుకెళుతుంది.. వచ్చే సంవత్సరం పారిస్‌లో జరిగే పారాలింపిక్స్‌లో భారతదేశం నుంచి సైక్లింగ్‌లో మొట్టమొదటి ఒలింపిక్‌ పతకాన్ని గెలుచుకురావాలని తపిస్తున్న గీత కలలు ఎంతో మందికి ఆదర్శం కావాలి.               

సమస్యలకు ఎదురెళ్లి
ఆసియా ఛాంపియన్‌షిప్‌ రేసులో ఎదురుదెబ్బ తగిలి, కింద పడిపోయింది. సైక్లింగ్‌ షూస్‌ చిరిగిపోవడం, పెడల్‌ నుంచి జారి పడిపోవడంతో ఎడమ కాలు మరింతగా బాధపెట్టింది. అయినప్పటికీ కొండ ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాల గుండా ఆమె తన రేస్‌లో పాల్గొంది. రెండవ స్థానంలో నిలిచి బహుమతి ప్రదానోత్సవానికి గంట ముందు అంబులెన్స్‌లో చికిత్స తీసుకుంటూ ఉంది. కిందటేడాది పారాసైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సూపర్‌ రాండన్యుర్‌గా పేరొందింది. ఒలింపిక్‌ ట్రై–అథ్లెట్‌లో రజత పతకాన్ని సాధించింది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)