Breaking News

దూసుకొచ్చిన మృత్యువు

Published on Tue, 12/03/2024 - 06:11

చేవెళ్ల: రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నచిరువ్యాపారులను దూసు­కొచ్చిన మృత్యువు కబళించింది. లారీ రూపంలో వచ్చి వారిని చిదిమేసింది. హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆగి ఉన్న బస్సును దాటి వెళ్తూ..: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఆలూరు, నాంచేరి, ఖానాపూర్‌ గ్రామాలకు చెందిన సుమారు 20 కుటుంబాల వారు నిత్యం ఆలూరు బస్‌ స్టేజీ వద్ద, రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజూలాగే సోమవారం కూడా కూరగాయలు విక్రయిస్తుండగా చేవెళ్ల నుంచి వికారాబాద్‌ వైపు అతివేగంగా వెళ్తున్న ఓ లారీ ఆలూరు స్టేజీ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును దాటి వెళ్లే క్రమంలో అదుపుతప్పి టీస్టాల్‌ స్టాండ్‌ను ఢీకొడుతూ రోడ్డు పక్కన కూరగాయలు విక్రయి­స్తున్న వారిపైకి దూసుకెళ్లింది.

 ఈ ప్రమాదంలో ఆలూ­రుకు చెందిన నక్కలపల్లి రాములు (48), దామరగిద్ద కృష్ణ (19), నాంచేరికి చెందిన శ్యామల సుజాత (42) అక్కడిక్కడే మృతిచెందారు. అలాగే కూరగాయలు కొనేందుకు అక్కడకు వచ్చిన జమీల్‌ (25), బాలమణి, చల్ల మాల్యాద్రి, కూరగాయల విక్రేతలు ఆకుల పద్మమ్మ, నక్కలపల్లి రేణకతో­పాటు లారీ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ జమీల్‌ మృతిచెందాడు.అతను ఆలూరు­లోని ఓ ఫాంహౌస్‌లో పనిచేస్తున్నాడు. మిగతా క్షతగాత్రులను వారివారి బంధువులు మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లారు.

షాక్‌లో డ్రైవర్‌..: ఈ ఘటనలో లారీ చివరకు రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొని ఆగిపోయింది. లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అవగా డ్రైవర్‌ కాలు విరిగి క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని జేసీబీల సాయంతో అతన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో షాక్‌లో ఉన్న డ్రైవర్‌ తన వివరాలు చెప్పలేకపోయాడు.

ప్రమాద తీవ్రతకు చెట్టు విరిగిపడటంతో చెట్టు కింద, లారీ ముందు భాగంలో ఎవరైనా ఇరుక్కుపోయారా? అనే విషయం వెంటనే తెలియరాక మృతుల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని పోలీసులు తొలుత భావించారు. చివరకు చెట్టును తొలగించాక దాని కింద ఎవరూ లేరని నిర్ధారణ అయింది. ఆ చెట్టు అడ్డుగా లేకపోయి ఉంటే అక్కడే కూరగాయలు విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్న మరో 30 మంది ప్రమాదం బారిన పడేవారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. 

సీఎం రేవంత్‌ దిగ్బ్రాంతి..: ఈ దుర్ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సంబంధిత అధికారు­లకు ఆదేశాలు జారీ చేశారు.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)