Breaking News

25 మంది కిడ్నాప్‌!: నలుగురి హత్య

Published on Wed, 09/23/2020 - 07:49

సాక్షి, చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో రెండు గ్రామాలకు చెందిన 25 మందిని కిడ్నాప్‌ చేసిన మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి నలుగురిని హత్య చేశారు. ఈ ఘటన బీజాపూర్‌ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. గంగులూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల కుర్చేలి, మోటాపాల్‌ గ్రామాలకు చెందిన 25 మంది గ్రామస్తులను మావోయిస్టులు మూడు రోజుల క్రితం కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే వారిని ప్రజాకోర్టులో విచారించి అనంతరం రెండు గ్రామాలకు చెందిన నలుగురిని ప్రజాకోర్టులోనే గొంతుకోసి దారుణంగా హతమార్చినట్లు సమాచారం. అనంతరం ఐదుగురిని విడిచిపెట్టినట్లు తెలుస్తుండగా.. మిగిలిన 16 మందిని వారి అదుపులోనే ఉంచుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కాగా.. ఈ విషయంపై పోలీసు అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. (ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ?)

ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఒకరి హత్య 
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో సోమ వారం రాత్రి మావోయిస్టులు ఓ గ్రామస్తుడిని హత్య చేశారు. బాసగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పుటాకేల్‌ గ్రామానికి సుమారు 20 మంది మావోయిస్టులు దసార్‌ రమణ ఇంటికి వచ్చారు. నిద్రిస్తున్న అతడిని లేపారు. మాట్లాడే పని ఉందని చెప్పి బయటకు రమ్మని పిలవడంతో.. అతడు నిరాకరించాడు. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే మాట్లాడాలంటూ పట్టుబట్టారు. దీంతో మావోయిస్టులు అతడిని బలవంతంగా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఇంటి ఎదుటే ఇనుప రాడ్లతో కొట్టడంతోపాటు రమణను కత్తులతో దారుణంగా పొడిచి చంపారు.ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు.

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)