Breaking News

పెట్టుబడి తక్కువ.. మోసం ఎక్కువ

Published on Sun, 07/28/2024 - 06:19

సాక్షి, అమరావతి: ప్రముఖ ఎల్రక్టానిక్స్‌ తయారీ సంస్థ పేరిట ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లాలో వేల మందిని సైబర్‌ నేరగాళ్లు మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే రెండు వారాల్లో రెట్టింపు ఆదాయం లభిస్తుందని బురిడీ కొట్టించారు. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టి మోసపోయామని విశాఖతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో బాధితులు లబోదిబోమంటున్నారు. 

తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు, లింక్‌ క్లిక్‌ చేస్తే చాలు అంటూ నెట్‌ఫ్లిక్స్‌ ఫాలో అనే యాప్‌ పేరిట 2021లో గుంటూరు, కృష్ణా, నెల్లూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది బాధితులను బురిడీ కొట్టించారు. రూ. లక్షల్లో సొమ్మును సైబర్‌ నేరగాళ్లు లూటీ చేశారు. ఇలాంటి నేరగాళ్లు, గొలుసుకట్టు ఇన్వెస్ట్‌మెంట్‌ సైబర్‌ ఫ్రాడ్స్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

గుంటూరుకు చెందిన రవి ఫోన్‌ నంబర్‌ను ఐపీజీ అనే పేరుతో ఉన్న ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో యాడ్‌ చేసినట్టు నోటిఫికేషన్‌ వచి్చంది. కొద్దిసేపటికి గ్రూప్‌ అడ్మిన్‌ ‘రూ.800 పెట్టుబడి పెడితే ఏడాదంతా రోజుకు రూ.35 చొప్పున ఆదాయం’ అంటూ మెసేజ్‌ పెట్టింది. గ్రూప్‌ సభ్యులు కొందరు కొన్ని స్క్రీన్‌షాట్స్‌ షేర్‌ చేసి తాముసంపాదిస్తున్నాం అంటూ వంతపాడారు. ఇవన్నీ చూసిన రవి వాళ్లను నమ్మి అడ్మిన్‌ సూచించిన యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని రూ.800 పెట్టుబడి పెట్టాడు. తనకు తెలిసిన మరికొందరితోనూ పెట్టుబడి పెట్టించాడు. ప్రారంభంలో వాళ్లు చెప్పినట్లే చెల్లిస్తూ వచ్చారు. 

ఇది బావుందని భావించి రవి రూ.50 వేల వరకూ పెట్టుబ­డి పెట్టాడు. అంతే రెండు రోజుల్లోనే యాప్‌ పనిచేయకుండా పోయింది. మెసేజ్‌లకు అడ్మిన్‌ రిప్లై ఇవ్వలేదు. దీంతో మోసపోయానని రవి గుర్తించి లబోదిబోమన్నాడు. తక్కువ పెట్టుబడి. ఎక్కువ ఆదాయం.. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.. ఇంట్లో కూర్చుని టాస్‌్కలు పూర్తి చేస్తే డబ్బు వచ్చి ఖాతాలో జమ అవుతుంది అంటూ సైబర్‌ నేరగాళ్లు విద్యావంతులను బురిడీ కొట్టిస్తున్నారు. వీళ్ల ఉచ్చులో పడి పలువురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌లు, ఉద్యోగులు, యువత తమ కష్టార్జితాన్ని సమరి్పంచుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  

నమ్మించిమోసం చేస్తారు..  
అదనపు ఆదాయం వస్తుందనికొందరి ఆశే.. సైబర్‌ మోసగాళ్లకు వరమవుతోంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే వరకూ నమ్మకంగా ఉంటూ ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. బాధితులు తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. టెలీగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల ద్వారా నేరగాళ్లు ప్రజలను ఆకట్టుకుంటున్నారు. 

గ్రూప్‌లు క్రియేట్‌ చేసి ఫలానా స్కీమ్‌ ద్వారా ఫలానా లాభం ఉంటుందని ఆకర్షిస్తున్నారు. ఈ తరహా యాప్‌లు, వెబ్‌సైట్‌లు రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఏదైనా యాప్, వెబ్‌సైట్‌ను సందర్శించే ముందు ఒకటి రెండుసార్లు పరిశీలించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  

ఫిర్యాదు చేయండిలా 
దేశంలో రోజు రోజుకు సైబర్‌ నేరాలు పెరుగుతున్న క్రమంలో ఫిర్యాదులు చేయడానికి కేంద్ర హోమ్‌ శాఖ ప్రత్యేక వేదికను అందుబాటులోకి తెచి్చంది.  
https://www. cybercrime.gov.in./  వెబ్‌సైట్‌ ద్వారా, 1930 టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి బాధితులు మోసాలపై ఫిర్యాదులు చేయవచ్చు. అదే విధంగాసమీపంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌/సాధారణ పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది. ఒక వేళ ఓటీపీ, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ల ద్వారా మోసానికి గురై డబ్బు పోగొట్టుకున్నట్లయితే వెంటనే ఫిర్యాదు చేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు.   

2023లో దేశ వ్యాప్తంగా సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోరి్టంగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో నమోదైన సైబర్‌ మోసాల ఫిర్యాదులు ఇలా..

» ఢిల్లీ 58,748

» బిహార్‌ 42,029

» ఛత్తీస్‌గఢ్‌ 18,147

» తెలంగాణ 71,426

» ఆంధ్రప్రదేశ్‌ 33,507

» కర్ణాటక 64,301  

» కేరళ 23,757  

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)