Breaking News

మార్కెట్లపై జీడీపీ ఎఫెక్ట్‌

Published on Mon, 12/02/2024 - 04:51

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం (జులై–సెపె్టంబర్‌)లో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను అందుకోలేకపోయింది. గత 7 త్రైమాసికాలలోనే అత్యల్పంగా 5.4 శాతంగా నమోదైంది. జీడీపీ గణాంకాలు గత వారాంతాన మార్కె ట్లు ముగిశాక వెలువడటంతో ఈ ప్రభావం నేడు (2న) దేశీ స్టాక్‌ మార్కెట్లపై కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు అంతర్జాతీయ పరిస్థితులు, విదేశీ పెట్టుబడులు, స్థూల ఆర్థిక గణాంకాలు సైతం ఈ వారం సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. ఈ వారం చివర్లో రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) పరపతి సమీక్షను చేపట్టనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 

ఆటో గణాంకాలు 

నవంబర్‌ నెలకు ఆటో రంగ గణాంకాలు ఆశావహంగా వెలువడ్డాయి. పెళ్లిళ్ల సీజన్‌కుతోడు.. ఎస్‌యూవీలకు డిమాండ్‌ కొనసాగడంతో వాహన విక్రయాలు సానుకూలంగా నమోదయ్యాయి. దీంతో సోమవారం(2న) ఆటో రంగ కౌంటర్లలో యాక్టివిటీ కనిపించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ ఏడాది క్యూ2లో అంచనాలను వమ్ము చేస్తూ జీడీపీ నెమ్మదించడంతో కొంతమేర సెంటిమెంటు బలహీనపడే వీలున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. తయారీ, మైనింగ్‌తోపాటు వినియోగం తగ్గడం జీడీపీని దెబ్బతీసింది. జీడీపీ మందగమన ప్రభావం ఆర్‌బీఐ నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని మిశ్రా తెలియజేశారు. వడ్డీ రేట్లపై నిర్ణయాలు కీలకంగా నిలవనున్నట్లు తెలియజేశారు.  

విదేశీ అంశాలు 

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ భౌగోళిక అనిశి్చతులు మార్కెట్లలో ఆందోళనలకు కారణమవుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌మీనా పేర్కొన్నారు. ప్రధానంగా రష్యా– ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం ప్రభావం చూపుతున్నట్లు వివరించారు. యూఎస్‌ తయారీ, సరీ్వసుల రంగ గణాంకాలు, వ్యవసాయేతర రంగంలో ఉపాధి, నిరుద్యోగిత అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మాస్టర్‌ క్యాపిటల్‌ సరీ్వసెస్‌ డైరెక్టర్‌ పాల్క అరోరా చోప్రా వివరించారు. వీటికితోడు యూఎస్‌ ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ ప్రసంగం(5న)పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు సంతోష్‌ మీనా పేర్కొన్నారు.  

ఆర్థిక గణాంకాలు 

దేశీయంగా ఈ వారం ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నట్లు అరోరా చోప్రా తెలియజేశారు. నవంబర్‌ నెలకు తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ గణాంకాలు నేడు వెలువడనున్నాయి. అక్టోబర్‌లో తయారీ రంగ పీఎంఐ 57.3కు చేరగా.. సరీ్వసుల రంగ పీఎంఐ 59.5గా నమోదైంది. క్యూ2లో దేశ జీడీపీ నీరసించినప్పటికీ ప్రపంచ దేశాలలో వేగవంత వృద్ధిగా నిలవడం ప్రస్తావించదగ్గ అంశమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇవికాకుండా డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ వంటి అంశాలూ కీలకమేనని తెలియజేశారు.  

గత వారమిలా.. 

పలు ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ నికరంగా 686 పాయింట్లు(0.9 శాతం) జంప్‌చేసింది. 79,803 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 224 పాయింట్లు(1 శాతం) ఎగసి 24,131 వద్ద స్థిరపడింది.

అమ్మకాలవైపే ఎఫ్‌పీఐలు 
నవంబర్‌లో రూ. 21,612 కోట్లు 
దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత నెల(నవంబర్‌)లో నికరంగా రూ. 21,612 కోట్ల(2.56 బిలియన్‌ డాలర్లు) విలువైన స్టాక్స్‌ విక్రయించారు. ఇందుకు ప్రధానంగా యూఎస్‌ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌ మెరుగుపడటం, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడటం, దేశీ ఆర్థిక వ్యవస్థ మందగించడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయితే అంతక్రితం నెల(అక్టోబర్‌)తో పోలిస్తే నవంబర్‌లో ఎఫ్‌పీఐల అమ్మకాల స్పీడ్‌ తగ్గింది. అక్టోబర్‌లో కొత్త చరిత్రను లిఖిస్తూ ఎఫ్‌పీఐలు దేశీ ఈక్విటీల నుంచి 11.2 బిలియన్‌ డాలర్లు(రూ. 94,017 కోట్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)