Breaking News

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో ఉల్లంఘనలపై దృష్టి 

Published on Fri, 05/23/2025 - 05:35

న్యూఢిల్లీ: ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌లో సీనియర్‌ యాజమాన్యం వైపు నుంచి ఏవైనా తీవ్రమైన ఉల్లంఘనలు చోటుచేసుకుంటే వాటిపై తప్పక దృష్టి సారిస్తామని సెబీ చైర్మన్‌ తుహిన్‌కాంత పాండే ప్రకటించారు. రూ.3,400 కోట్ల మేర ఖాతాల్లో మోసాలపై ఆరోపణలు రావడం తెలిసిందే. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో సమస్యలను ఆర్‌బీఐ చూసుకుంటుందని.. సెక్యూరిటీస్‌ మార్కెట్‌ నిబంధనల ఉల్లంఘనలను సెబీ పరిశీలిస్తుందని పాండే స్పష్టం చేశారు.

అసోచామ్‌ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పాండే పై విధంగా బదులిచ్చారు. మోసంలో కొందరు ఉద్యోగుల పాత్ర ఉందన్న అనుమానాన్ని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ బోర్డు వ్యక్తం చేస్తూ.. దీనిపై దర్యాప్తు సంస్థలు, నియంత్రణ సంస్థలకు నివేదించాలని యాజమాన్యాన్ని కోరడం గమనార్హం. డెరివేటివ్‌లు, సూక్ష్మ రుణాల పోర్ట్‌ఫోలియోలో మోసాలు వెలుగు చూడడం తెలిసిందే. 

సీనియర్‌ ఉద్యోగుల పాత్ర ఉందంటూ అంతర్గత ఆడిట్‌ తేల్చడంతో ప్రస్తుతం ఫోరెన్సిక్‌ దర్యాప్తు కొనసాగుతోంది. ఖాతాల మోసాల్లో సీనియర్‌ యాజమాన్యం పాత్ర ఉండొచ్చంటూ బ్యాంక్‌ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచి్చంది. ఇప్పటి వరకు ఆడిటింగ్, దర్యాప్తులో గుర్తించిన లోపాలను మార్చి త్రైమాసికం ఫలితాల్లో పేర్కొన్నట్టు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తెలిపింది. డెరివేటివ్‌లో అక్రమాలకు సంబంధించి రూ.1,960 కోట్లను గుర్తించడంతోపాటు, తప్పుడు లెక్కలకు సంబంధించి రూ.674 కోట్లను రివర్స్‌ చేయడం గమనార్హం. మార్చి త్రైమాసికానికి బ్యాంక్‌ రూ.2,329 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.  

ఎన్‌ఎస్‌ఈ ఐపీవో సవాళ్లకు చెక్‌ 
స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్‌ ఇష్యూకి అడ్డుగా నిలుస్తున్న సమస్యలు త్వరలో పరిష్కారంకాగలవని క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. కొన్ని అంశాల కారణంగా నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీ(ఎన్‌ఎస్‌ఈ) ఐపీవో ప్రతిపాదన సెబీ వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 

కీలక యాజమాన్య వ్యక్తులకు చెల్లించిన పరిహారం, టెక్నాలజీ, క్లియరింగ్‌ కార్పొరేషన్‌లో మెజారిటీ ఓనర్‌షిప్‌ తదితరాలకు పరిష్కారం లభించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలనూ తొలగించేందుకు ఎన్‌ఎస్‌ఈ, సెబీ చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అసోచామ్‌ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో పాండే ఈ విషయాలు వెల్లడించారు. ఇందుకు గడువును ప్రకటించనప్పటికీ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలియజేశారు. ఎన్‌వోసీ కోసం సెబీకి ఎన్‌ఎస్‌ఈ తిరిగి దరఖాస్తు చేసిన నేపథ్యంలో పాండే వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)