భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
Breaking News
ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు
Published on Wed, 10/01/2025 - 21:04
దసరా, దీపావళి పండుగల సందర్భంగా రిలయన్స్ డిజిటల్ భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించింది. “ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్” పేరుతో ఎలక్ట్రానిక్ వస్తువులను తగ్గింపు జీఎస్టీ ధరలపై అందిస్తోంది. అగ్రగామి బ్యాంక్ కార్డులపై అన్ని రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్, జియో మార్ట్ డిజిటల్ స్టోర్స్, ఆన్లైన్ (www.reliancedigital.in)లో రూ.15000 వరకు సత్వర డిస్కౌంట్ కల్పిస్తోంది.
కస్టమర్లు పేపర్ ఫైనాన్స్ ఎంచుకుంటే రూ.30,000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. దీంతో పెద్ద విలువ గల ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం సులభం అవుతుంది. రిలయన్స్ డిజిటల్ వారి ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ అక్టోబర్ 25 వరకు ఈ ఆఫర్లు కొనసాగుతాయి. రిలయన్స్ డిజిటల్ లో లభించే కొన్ని డీల్స్ ఇవీ...
• తోషిబా 65 ఇంచ్ క్యూ ఎల్ఈడీ రూ. 45,990 లకే.
• ఐఫోన్ 16ఈ ప్రారంభ ధర రూ.44,990
• 1 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ప్రారంభ ధర రూ.17,990
• రిఫ్రిజిరేటర్ కొంటే రూ.8,990 వరకు విలువ గల ఫ్రీబీస్.
• డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ప్రారంభ ధర రూ.18,990
• సెమీ- ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ధరలో టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ప్రారంభ ధర రూ. 10,990
• చిన్న డొమెస్టిక్ వస్తువులు 1 కొంటే 5% తగ్గింపు, 2 కొంటే 10% తగ్గింపు, 3 లేదా అంతకంటే ఎక్కువ వస్తువులపై 15% తగ్గింపు
• పర్సనల్ ఆడియో, స్మార్ట్ వాచీలు, టాబ్లెట్స్, ఇతర టెక్ యాక్సెసరీస్ పై 5% తగ్గింపు.
Tags : 1