రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టేయండిలా!
Published on Tue, 07/13/2021 - 11:03
ముంబై: ప్రభుత్వ సెక్యూరిటీలలో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపట్టేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ తాజాగా పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్’ పేరుతో ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులకు వన్స్టాప్ సొల్యూషన్ను ఆవిష్కరించింది. ఇందుకు ‘రిటైల్ డైరెక్ట్ గిల్ట్’ ఖాతాను ప్రారంభించి నిర్వహించేందుకు ఎలాంటి ఫీజునూ వసూలు చేయరు. అయితే పేమెంట్ గేట్వే ఫీజులు అమలవుతాయి. వీటిని రిజిస్టర్ చేసుకున్న రిటైల్ ఇన్వెస్టర్లు చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీలలో రిటైలర్ల లావాదేవీలను పెంచే బాటలో ఆర్బీఐ తాజా చర్యలు తీసుకుంది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా రిటైలర్లు ప్రభుత్వ బాండ్ల జారీ వివరాలను పొందవచ్చు.
#
Tags