Breaking News

కంపెనీల కక్కుర్తి.. ‘చంపేస్తోంది’!

Published on Sun, 11/09/2025 - 11:19

పారిశ్రామిక వ్యర్థాలు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాలను కలిగిస్తున్నాయి. భారతదేశంలో పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్న రసాయనిక, లోహాలు, ప్లాస్టిక్, బయోమెడికల్ వ్యర్థాలు సరైన శుద్ధి లేకుండా నీటిలో, భూమిలో, గాలిలో కలవడం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి.

దేశంలోని చాలా పరిశ్రమలు వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం లేదని, హానికరమైన రసాయనిక వ్యర్థాలను ఎటువంటి సంస్కరణ లేకుండా అలాగే బయటకు వదిలేస్తున్నాయని, దీంతో నదీ జలాలు కలుషితమవుతున్నాయని ఎప్పటి నుంచో ఫిర్యాదు ఉన్నాయి. విషయంలో కాలుష్య నియంత్రణ బోర్డులు సైతం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయన్న విమర్శలు ఉన్నాయి.

ఇదే విషయంగా శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థాలను నీటి వనరులలోకి విడుదల చేస్తున్న పరిశ్రమలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కొరడా ఝుళిపించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 1,700 కి పైగా స్థూల కాలుష్య పరిశ్రమలపై (జీపీఐలు) సత్వరమే చర్యలు తీసుకోవాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)తోపాటు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా, బీహార్ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డులకు గట్టి ఆదేశాలు జారీ చేసింది.

వందలాది స్థూల కాలుష్య పరిశ్రమలు వ్యర్థాల విడుదలను పర్యవేక్షించే ఆన్లైన్ కంటిన్యూయస్ ఎఫ్లూయెంట్ మానిటరింగ్ సిస్టమ్స్ (OCEMS)ను ఏర్పాటు చేసుకోవడంలో విఫలమయ్యాయంటూ ధాఖలైన పిటిషన్పై విచారించిన ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. చర్యలు తీసుకుంటున్న 1700 పరిశ్రమల్లో అత్యధికంగా హర్యానాలో 812, ఉత్తర ప్రదేశ్లో 704, ఢిల్లీలో 149, బిహార్లో 21 ఉన్నాయి.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. రోజుకు 10 కిలో లీటర్ల వ్యర్థాలను విడుదల చేసే పరిశ్రమలు తప్పనిసరిగా ఓసీఈఎంఎస్వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అదే తక్కువ స్థాయిలో వ్యర్థాలను విడుదల చేసే పరిశ్రమలైతే ఫ్లో మీటర్లను, వెబ్కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.

ఎంత తేడా?

వ్యర్థాల నిర్వహణలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశంలోని పరిశ్రమలు చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాయి. సాంకేతికతలను వినియోగించడంలోనూ వెనుకబడ్డాయి. ఖర్చును తగ్గించుకునేందుకు అంతగా శిక్షణలేని శ్రామిక శక్తితో నెట్టుకొస్తున్నాయి. వ్యర్థాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం అభివృద్ధి చెందిన దేశాల్లోని పరిశ్రమలు అధునాతన ఆటోమేషన్, ఏఐ-ఆధారిత సెగ్రిగేషన్, జీపీఎస్ట్రాకింగ్ సాంకేతికతలను వినియోగిస్తుంటే భారత్లోని పరిశ్రమలు పాక్షిక యాంత్రిక వ్యవస్థలతో మానవ శ్రమపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి.

ఇక వ్యర్థాల నిర్వహణకు అభివృద్ధి చెందిన దేశాల్లో చేస్తున్న ఖర్చు, భారత్లో పరిశ్రమలు వెచ్చిస్తున్న మొత్తాన్ని పరిశీలిస్తే గణనీయమైన వ్యత్యాసం కనపడుతుంది. వ్యర్థాల నిర్వహణ, సంస్కరణకు అమెరికా, యూరోపియన్యూనియన్దేశాలు ఒక టన్నుకు రూ.8 వేల నుంచి రూ.25 వేల వరకూ ఖర్చు చేస్తుంటే మన దేశంలో పరిశ్రమలు చేస్తున్న ఖర్చు కేవలం రూ.1,500 నుంచి రూ.3వేలు మాత్రమే.

పారిశ్రామిక వ్యర్థాలతో ప్రధాన నష్టాలు

గంగా, యమునా వంటి నదుల్లో శుద్ధి చేయని వ్యర్థాల కలవడం వల్ల నీటి నాణ్యత తీవ్రంగా తగ్గుతోంది. ఇది తాగునీటి, వ్యవసాయ నీటి వినియోగాన్ని ప్రమాదంలోకి నెట్టుతోంది. పారిశ్రామిక ఘన వ్యర్థాలు (లోహపు స్క్రాప్ లు, నిర్మాణ శిధిలాలు) భూమిలోకి చేరడం వల్ల మట్టిలో విషపదార్థాలు చేరి, వ్యవసాయ ఉత్పాదకత తగ్గుతోంది. పరిశ్రమలు నుండి వెలువడే వాయువులు శ్వాస సంబంధిత వ్యాధులకు దారితీస్తున్నాయి. చర్మ రుగ్మతలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, నాడీ సంబంధిత రుగ్మతలు వంటి వ్యాధులు పరిశ్రమల చుట్టుపక్కల నివసించే ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

నదుల్లోని జీవరాశి విషపూరిత రసాయనాల వల్ల మరణిస్తోంది. ఇది ఆహార గొలుసు అసమతుల్యతకు దారితీస్తోంది. పర్యావరణ నాశనం వల్ల పర్యాటకం, వ్యవసాయం, మత్స్య రంగాలు తీవ్రంగా ప్రభావితమై ఆర్థిక వ్యవస్థకూ చేటు కలిగిస్తోంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 62 మిలియన్ టన్నుల ఘన వ్యర్థాల ఉత్పత్తి అవుతోంది. ఇందులో ఎక్కువ భాగం పారిశ్రామిక వ్యర్థాలే.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)