Breaking News

ఛార్జీల రూపంలో బ్యాంకులకు భారీ ఆదాయం

Published on Mon, 09/20/2021 - 21:16

2020-21 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బి)కు చార్జీల రూపంలో భారీగా ఆదాయం సమకూరింది. ఖాతాదారులు తమ ఖాతాల్లో అవసరమైన కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఛార్జీలు విధించడం వల్ల దాదాపు 170 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆర్టీఐ సమాచారం తెలిసింది. ఛార్జీల విధించడం వల్ల ఆర్జించిన పీఎన్‌బి ఆదాయం 2019-20లో రూ.286.24 కోట్లుగా ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు త్రైమాసిక ప్రాతిపదికన ఛార్జీలను విధిస్తుంటాయి.

2020-21 ఏప్రిల్-జూన్ కాలంలో త్రైమాసిక సగటు బ్యాలెన్స్(క్యూఏబి) రూ.35.46 కోట్లుగా(పొదుపు, కరెంట్ ఖాతా రెండింటిలోనూ) ఉంది. అయితే ఎఫ్ వై21 రెండో త్రైమాసికంలో ఏటువంటి ఛార్జీలు విధించలేదు. మూడో, నాలుగో త్రైమాసికాల్లో క్యూఏబీ నిర్వహణేతర ఛార్జీలు వరుసగా రూ.48.11 కోట్లు, రూ.86.11 కోట్లుగా ఉన్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త చంద్ర శేఖర్ గౌర్ సహచట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా.. పీఎన్‌బీ ఈ సమాధానమిచ్చింది. అలాగే, రుణదాత సంవత్సరంలో ఏటీఎం లావాదేవీ ఛార్జీల రూపంలో రూ.74.28 కోట్లు వసూలు చేసింది. అంతకు ముందు ఏడాది 2019-20లో ఇది రూ.114.08 కోట్లుగా ఉంది. 2020-21 మొదటి త్రైమాసికంలో ఏటీఎం లావాదేవీ ఛార్జీలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రద్దు చేసినట్లు బ్యాంకు తెలిపింది.(చదవండి: వీటి కోసం గూగుల్​లో వెతికితే ప్రమాదమే..!)

Videos

కలర్ ఫుల్ బ్యూటీస్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నరాలు తెగే హైప్ ఇచ్చిన హృతిక్ రోషన్

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య ఎమోషనల్..

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

రేపట్నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం

Liquor Case: రాజకీయ కక్ష అని తేలితే...? సుప్రీం సీరియస్

Miss World 2025: అందం అంటే..!

మాట నిలబెట్టుకున్న జగన్.. ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల చెక్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ రిప్లై

సమంత లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్?

Photos

+5

ఈ తప్పులు చేస్తే EPF క్లెయిమ్‌ రిజెక్టే.. (ఫొటోలు)

+5

Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' హీరో క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

Subham Success Meet : శుభం సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)

+5

'వచ్చినవాడు గౌతమ్‌' సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

సుందరీమణుల మనస్సు దోచిన 'పోచంపల్లి చీరలు'..ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)

+5

సరస్వతి పుష్కరాలు.. కాళేశ్వరంలో సీఎం రేవంత్‌ పర్యటన (ఫొటోలు)

+5

Miss World 2025 : యాదగిరిగుట్ట, పోచంపల్లిలో మిస్‌ వరల్డ్‌ బ్యూటీస్‌ సందడి (ఫొటోలు)

+5

బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)