రాజీనామా చెయ్! నీకు రోజులు దగ్గర పడ్డాయి ధూళిపాళ్ల నరేంద్ర... బ్రాహ్మణుల ఉసురు ఊరికే పోదు
Breaking News
ఉల్లి ధరల దూకుడుకు కారణాలేంటో..
Published on Thu, 08/27/2026 - 10:08
దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న ధరలు, వినియోగదారులకు అమ్మే రిటైల్ ధరల మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించే మార్గాలను కనుగొనాలని ఆయన ఐసీఏఆర్ను ఆదేశించారు. మహారాష్ట్ర రైతులు ఇప్పటికే తక్కువ ధరలకు పంటను విక్రయించారని, ఇప్పుడు నిల్వ లేకపోయినా ధరలు పెరగడం అనుమానాస్పదమని తెలిపారు.
గణాంకాలు చెబుతున్న వాస్తవం
దేశవ్యాప్తంగా మోడల్ ధర: ₹50/kg
పంజాబ్: రూ.53 కేజీ (మూడు నెలల్లో 130% పెరుగుదల)
ఢిల్లీ: రూ.55 కేజీ (ఒక నెలలో 22%, మూడు నెలల్లో 83% పెరుగుదల)
చెన్నై: రూ.60 కేజీ (గత సంవత్సరం రూ.35తో పోలిస్తే)
కోల్కతా: రూ.60 కేజీ (గత సంవత్సరం రూ.32తో పోలిస్తే)
ముంబై: రూ.48 కేజీ (గత సంవత్సరం రూ.32తో పోలిస్తే)
ప్రభుత్వ చర్యలు
ధరల పెరుగుదల నియంత్రణ కోసం ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతుల వద్ద ఉల్లిపాయలను రూ.15-20/kg ధరకు కొనుగోలు చేసింది. ఢిల్లీలో వినియోగదారులకు రూ.35/kg ధరకు ఉల్లిపాయలు విక్రయించేందుకు సిద్ధమైంది. నాసిక్ నుంచి కాందా ఎక్స్ప్రెస్ ద్వారా 800 టన్నుల బఫర్ స్టాక్ ఢిల్లీకి చేరుకోనుంది. నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ స్టోర్లు, మొబైల్ వాన్ల ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయం జరగనుంది.
ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా..
Tags : 1