Breaking News

యూజర్‌ మాన్యువల్‌ మిస్సింగ్‌.. రూ.5 వేలు జరిమానా

Published on Mon, 12/09/2024 - 15:04

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు బెంగళూరు వినియోగదారు వివాదాల పరిష్కార కమిషన్‌ రూ.5,000 జరిమానా విధించింది. కొత్తగా ఫోన్‌ కొనుగోలు చేసిన మొబైల్‌ ప్యాక్‌లో యూజర్‌ మాన్యువల్‌ రానందుకు కస్టమర్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. దాంతో విచారణ జరిపిన కమిషన్‌ ఇటీవల తీర్పునిచ్చింది.

బెంగళూరులోని సంజయ్‌ నగర్‌కు చెందిన ఎంస్‌ఎం రమేష్‌ అనే వినియోగదారుడు వన్‌ప్లస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన నార్డ్ సీఈ 3 మోడల్‌ ఫోన్‌ను కొనుగోలు చేశాడు. ఫోన్‌ విక్రయించిన ఆరు నెలల తర్వాత, జూన్‌లో వినియోగదారుల పరిష్కార వేదికకు ఫిర్యాదు చేశాడు. తాను రూ.24,598కి వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొన్నానని, అయితే అందులో యూజర్ మాన్యువల్‌ లేదని ఫిర్యాదులో తెలిపాడు. ఫోన్ వారంటీ సమాచారం, కంపెనీ చిరునామాను తెలుసుకోవడంలో తాను ఎంతో ఇబ్బంది పడ్డానని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి కంపెనీని ఫిర్యాదు చేసిన తర్వాత ఏప్రిల్‌లో వన్‌ప్లస్‌ మాన్యువల్‌ను అందించిందన్నారు. ఫోన్ కొనుగోలు చేసిన నాలుగు నెలల తర్వాత ‘సేవలో లోపం’ కారణంగా ఇలా చేయడం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: పది పాసైన మహిళలకు ఎల్‌ఐసీ ఉపాధి అవకాశం

వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ వన్‌ప్లస్ ఇండియా వ్యవహారం పూర్తిగా నిర్లక్ష్యం, ఉదాసీనతను చూపుతుందని పేర్కొంటూ రూ.5,000 జరిమానా విధించింది.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)