Breaking News

పాన్‌–ఆధార్‌ లింక్‌ చేయకపోతే పెనాల్టీ

Published on Thu, 03/31/2022 - 01:05

న్యూఢిల్లీ: ఆధార్‌తో పాన్‌ అనుసంధానానికి ఇచ్చిన గడువు గురువారం (మార్చి 31)తో ముగియనుంది. గడువులోపు అనుసంధానించుకోని వారు (లింకింగ్‌) ఆ తర్వాత రూ.500 నుంచి రూ.1,000 వరకు జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుందని ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. గడువులోపు ఆధార్‌తో పాన్‌ లింకింగ్‌ చేసుకోని వారికి కాస్త ఉపశమనం కల్పించింది. 2023 మార్చి 31 వరకు పాన్‌ పనిచేస్తుందని ప్రకటించింది. అప్పటికీ అనుసంధానం చేసుకోకపోతే పాన్‌ పనిచేయకుండా (ఇన్‌ ఆపరేటివ్‌) పోతుంది. ‘‘2022 జూన్‌ 30 వరకు పాన్‌–ఆధార్‌ లింకింగ్‌ చేసుకుంటే రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఆ తర్వాత అనుసంధానించుకుంటే రూ.1,000 జరిమానా ఉంటుంది’’అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిపై ఏకేఎం గ్లోబల్‌ ట్యాక్స్‌ పార్ట్‌నర్‌ అమిత్‌ మహేశ్వరి స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో విడతలుగా పాన్‌–ఆధార్‌ లింకింగ్‌ గడువును పొడిగిస్తూ వచ్చింది. చివరికి ఆలస్యపు రుసుములతో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనుసంధానించుకోడంలో విఫలమైతే పాన్‌ పనిచేయదు. దీంతో పన్ను రిటర్నులకు సంబంధించి పాన్‌ అందుబాటులో ఉండదు. కనుక పన్ను చెల్లింపుదారులు అందరూ ఒక్కసారి తమ పాన్, ఆధార్‌తో అనుసంధానమైందీ, లేనిదీ ఆదాయపన్ను శాఖ పోర్టల్‌కు వెళ్లి పరిశీలించుకోవాలి’’ అని పేర్కొన్నారు.  

అన్నింటికీ పాన్‌ అవసరమే..
ఆదాయపన్ను రిటర్నులు దాఖలుతోపాటు ఇతర ఐటీ వ్యవహారాలకు (రిఫండ్‌లు తదితర) ఇక మీదట పాన్‌ ను ఆధార్‌తో అనుసంధానించుకోవడం తప్పనిసరి అని నాంజియా ఆండర్సన్‌ ఎల్‌ఎల్‌పీ పార్ట్‌నర్‌ నీరజ్‌ అగర్వాల్‌ తెలిపారు. బ్యాంకు ఖాతా తెరిచేందుకు, స్థిరాస్తి కొనుగోళ్లకు పాన్‌ తప్పనిసరి. దీంతో పాన్‌ పనిచేయకపోతే పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘‘ఒక్కసారి పాన్‌ పనిచేయకుండా పోతే, ఆర్థిక లావాదేవీలు (ఫండ్స్, స్టాక్స్, బాండ్లలో పెట్టుబడులు) నిర్వహించడానికి అవకాశం ఉండదు. సెక్షన్‌ 171బీ కింద జరిమానాతోపాటు, అధిక టీడీఎస్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని అగర్వాల్‌ వివరించారు. గడువులోపు ఏౖదైనా సమస్య వల్ల అనుసంధానం చేసుకోని వారు ఆలస్యపు రుసుము చెల్లించి అయినా 2023 మార్చి 31లోపు లింక్‌ చేసుకోవడం తప్పనిసరి. లేదంటే పాన్‌ పనిచేయకుండా పోతుందని గుర్తుంచుకోవాలి. 2022 జనవరి 24 నాటికి 43.34 కోట్ల పాన్‌లు ఆధార్‌తో లింక్‌ అయ్యాయి. ఇప్పటి వరకు 131 కోట్ల ఆధార్‌లు జారీ అయ్యాయి.   

Videos

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులతో కలిసి పోరాడుతాం: బొత్స

Nizamabad: ముగ్గురు చిన్నారుల పట్ల కర్కశంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడు శంకర్

తమ్మినేని సీతారాం హౌస్ అరెస్ట్... ఆముదాలవలసలో ఆందోళన

Sahasra Mother: హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర..!

బాబు సర్కార్ అప్పులు.. కాగ్ నివేదికపై వైఎస్ జగన్ రియాక్షన్

కూకట్‌పల్లి పీఎస్ వద్ద సహస్ర కుటుంబసభ్యుల ఆందోళన

ఏడు అంశాల అజెండాగా పీఏసీ సమావేశం

నాకు నటించాల్సిన అవసరం లేదు కూన రవికుమార్ బండారం బయటపెట్టిన సౌమ్య

కూటమి ప్రభుత్వంలో పెన్షనర్ల కూడు లాక్కుంటున్నారు

Sahastra Incident: క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకే బాలుడు వెళ్లాడు: సీపీ మహంతి

Photos

+5

కాబోయే మరదలితో రిబ్బన్‌ కట్‌ చేసిన సారా.. సచిన్‌ పుత్రికోత్సాహం (ఫొటోలు)

+5

పట్టుచీరలో చందమామలా.. అనసూయ కొత్త ఫొటోలు

+5

ఆఖరి శ్రావణ శుక్రవారం పూజ : నిండు గర్భిణి సోనియా ఆకుల (ఫొటోలు)

+5

తెలంగాణ : ప్రసిద్ద వెంకటేశ్వర ఆలయం రత్నాలయం.. తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)

+5

ప్రభాస్ ఫస్ట్‌ హీరోయిన్‌ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)