Breaking News

మహీంద్రా కొత్త ప్లాంట్‌

Published on Tue, 05/06/2025 - 00:36

ముంబై/న్యూఢిల్లీ: దేశీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (2024–25, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 13.3% ఎగబాకి రూ.3,542 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,125 కోట్లుగా నమోదైంది.

 మొత్తం ఆదాయం రూ.35,373 కోట్ల నుంచి రూ.42,586 కోట్లకు పెరిగింది. 20% వృద్ధి చెందింది. వాహన, వ్యవసాయ పరికరాల విభాగాల మెరుగైన పనితీరు ఇందుకు దోహదం చేసినట్లు మహీంద్రా గ్రూప్‌ ఎండీ, సీఈఓ అనీష్‌ షా చెప్పారు. కాగా, క్యూ4లో కంపెనీ 18 శాతం పెరుగుదలతో మొత్తం 2.53 లక్షల వాహనాలను విక్రయించింది. ఇందులో ఎస్‌యూవీలు 1.49 లక్షలుగా ఉన్నాయి. 

కొత్త ప్లాంట్‌... 
ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) తయారీ కోసం కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2028 మార్చి నాటికి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించవచ్చని అంచనా. ‘మేము భవిష్యత్తు తరం వాహనాల నిమిత్తం ఒక కొత్త ప్లాంట్‌ను నెలకొల్పనున్నాం. ప్రధానంగా పీవీల కోసం ప్రణాళిక రూపొందిస్తున్నప్పటికీ.. అవసరాన్ని బట్టి కొన్ని ఇతర ప్రత్యేక వాహనాలను కూడా జత చేసే అవకాశం ఉంది. ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఇంకా నిర్ణయించలేదు. 

వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటాం’ అని మహీంద్రా సీఈఓ (ఆటోమోటివ్, వ్యవసాయ పరికరాలు) రాజేష్‌ జెజూరికర్‌ పేర్కొన్నా రు. కాగా, చకన్‌ (పుణే)లో అదనంగా 1.2 లక్షల వార్షిక  తయారీ సామర్థ్యాన్ని జత చేసేలా కొత్త ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు  ఆయన చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్‌ 15న దీన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. ఎక్స్‌యూవీ3ఎక్స్‌ఓ, థార్‌ రాక్స్‌ తయారీ సామర్థ్యాన్ని 2025–26లో 3,000 మేర పెంచుతామని వెల్లడించారు. 

పూర్తి ఏడాదికి... 
మార్చితో ముగిసిన 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.14,073 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది లాభం రూ.12,270 కోట్లతో పోలిస్తే 15 శాతం ఎగసింది. మొత్తం ఆదాయం కూడా 15 శాతం వృద్ధితో రూ.1,38,279 కోట్ల నుంచి రూ.1,58,750 కోట్లకు చేరింది. కాగా, ఒక్కో షేరుకు రూ.25.30 చొప్పున తుది డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. 

ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్‌ఎం షేరు బీఎస్‌ఈలో 3 శాతం ఎగసి రూ.3,021 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 11,322 కోట్లు ఎగసి రూ.3,72,720 కోట్లకు చేరింది.  

Videos

ప్రధాని మోదీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశి

వెన్నుపోటు దినం పోస్టర్ ను ఆవిష్కరించిన YSRCP నేతలు

దేశాలు చూపిస్తానంటూ.. దేశ ద్రోహం

ఓ మహిళకు బీజేపీ నేత అబ్బినేని బాబు లైంగిక వేధింపులు

మిల్లా మ్యాగీపై లండన్ లో కేసు

చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

బీజేపీలో పార్టీ విలీనాన్ని నేను ఒప్పు కోను: ఎమ్మెల్సీ కవిత

అంకితా భండారీ హత్య కేసులో దోషులకు జీవితఖైదు

కన్నడ భాష వివాదంపై స్పందించిన కమల్ హాసన్

మహేష్ బాబు అభిమాని అత్యుత్సాహం..

Photos

+5

బిగ్‌బాస్ ప్రియాంక బ్లాక్ బస్టర్ పోజులు (ఫొటోలు)

+5

చాహల్‌తో విడాకులు.. లండన్‌లో చిల్ ‍అవుతోన్న ధనశ్రీ వర్మ (ఫొటోలు)

+5

పెళ్లయి పదేళ్లు.. అల్లరి నరేశ్ భార్య-కూతుర్ని చూశారా? (ఫొటోలు)

+5

కొడుకు బారసాల జ్ఞాపకాలతో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

2024 'గద్దర్‌ అవార్డ్స్‌'తో ట్రెండ్‌ అవుతున్న తెలుగమ్మాయి (ఫోటోలు)

+5

నటి బ్రిగిడా సాగా..కిక్‌ ఇచ్చే ఫోటోలు చూశారా..?

+5

విశాఖపట్నం : సంద్రం.. కల్లోలం (ఫొటోలు)

+5

వైజాగ్‌ లో గ్రాండ్‌గా ‘థగ్ లైఫ్’ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

పంజాబ్‌ను మట్టికరిపించిన పాటీదార్‌ సేన.. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ (ఫొటోలు)

+5

జోగి రమేష్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌.. నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం (ఫొటోలు)