Breaking News

ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్ల ఆదాయాలు రయ్‌.. 

Published on Sat, 04/12/2025 - 06:01

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ విమానాశ్రయాల ఆపరేటర్ల ఆదాయాలు 18–20 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. ప్యాసిజర్ల ట్రాఫిక్‌ పెరుగుతుండటం, టారిఫ్‌ల పెంపుతో పాటు ఏరోనాటికల్‌యేతర ఆదాయాలు మెరుగుపడుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, గత ఆర్థిక సంవత్సరం నమోదైన 10 శాతం వృద్ధిని బట్టి చూస్తే,  ఈ ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ల ట్రాఫిక్‌ (దేశీ, విదేశీ రూట్లలో ప్రయాణించేవారు కలిపి) సుమారు 7–9 శాతం పెరిగి 44–45 కోట్లకు చేరనుంది. 

గత ఆర్థిక సంవత్సరం ఈ సంఖ్య 41.2–41.5 కోట్ల స్థాయిలో నమోదైంది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నిర్వహణలో ఉన్నవి, అలాగే పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌ కింద నిర్వహించే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కొచి్చన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులు సహా వివిధ విమానాశ్రయాల శాంపిల్‌ సెట్‌ ఆధారంగా ఇక్రా ఈ నివేదికను రూపొందించింది. కొత్తగా భోగాపురం (ఆంధ్రప్రదేశ్‌), పరందూర్‌ (చెన్నై), నవీ ముంబై, జేవర్‌ (నోయిడా) వంటి విమానాశ్రయాలు వస్తుండటంతో రాబోయే 4–5 ఏళ్లలో రూ. 1 లక్ష కోట్ల పైచిలుకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.   

ఇంటర్నేషనల్‌ ట్రాఫిక్‌ దన్ను..  
‘కొత్త ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడటం, అంతర్జాతీయంగా టూరిజం పుంజుకోవడంలాంటి అంశాల దన్నుతో దేశీ రూట్లలో ప్రయాణించే ప్యాసింజర్ల రద్దీని మించి ఇంటర్నేషనల్‌ ట్రాఫిక్‌ ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చు. అంతర్జాతీయ ట్రాఫిక్‌ 7–11 శాతం, దేశీ ట్రాఫిక్‌ 6–8 శాతం పెరగొచ్చు’ అని ఇక్రా సెక్టార్‌ హెడ్‌ (కార్పొరేట్‌ రేటింగ్స్‌) జి. వినయ్‌ కుమార్‌ తెలిపారు. దేశీ ట్రాఫిక్‌తో పోలిస్తే అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించిన ట్రాఫిక్‌ మరింత లాభదాయకంగా ఉంటుందన్నారు. ఇది పెరగడమనేది ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్లకు సానుకూలాంశమని వివరించారు.

 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)