Breaking News

వచ్చే ఐదేళ్లలో 50 ఎయిర్‌పోర్ట్‌లు ఏర్పాటు

Published on Tue, 06/03/2025 - 14:05

దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేసి మొత్తం ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్యను 212కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం (ఐఏటీఏ) వార్షిక సమావేశంలో ఈమేరకు కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. ఈ విస్తరణలో ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కీలకంగా వ్యవహరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

దేశం అంతటా ప్రజలకు మరింత చౌకగా, అందుబాటు ప్రాంతాల్లో విమానప్రయాణం చేసేలా ఉడాన్‌ పథకం సంస్కరణలు తీసుకొస్తోంది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి 619 కొత్త మార్గాలను నెట్‌వర్క్‌లో జోడించింది. ఇది చిన్న పట్టణాలు, నగరాలకు ప్రత్యక్ష విమాన కనెక్టివిటీని పొందేందుకు దోహదపడుతుంది. విమానాశ్రయాల సంఖ్యను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమవుతుందని మంత్రి చెప్పారు.

ఇదీ చదవండి: 15 రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గింపు

ప్యాసింజర్ కనెక్టివిటీకి మించి భారత్‌ గ్లోబల్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ (ఎంఆర్ఓ) హబ్‌గా కూడా నిలదొక్కుకుంటోంది. 2031 నాటికి ఎంఆర్‌ఓ విభాగం 4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. దేశీయ, అంతర్జాతీయ విమానాల నిర్వహణ అవసరాలను తీర్చే ప్రపంచ స్థాయి సౌకర్యాలను సృష్టించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మార్పు విదేశీ మరమ్మతు సేవలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. భారతదేశ విమానయాన ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది.

#

Tags : 1

Videos

Kaleshwaram Commission: 40 నిమిషాలు హరీశ్ రావును ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్

MP Gurumurthy: ముందుగానే ప్లాన్ చేసి సాక్షిపై దాడులకు స్కెచ్ వేసిన పచ్చపార్టీ

Lakshmi Parvathi: చంద్రబాబు, లోకేష్ అరాచక పాలనకు కొమ్మినేని అరెస్టు నిదర్శనం

Anantapur: ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య పై గిరిజన సంఘాల ఆగ్రహం

11 ఏళ్ల పాలనను 11ఏళ్ల సేవగా నిర్వహిస్తున్న బీజేపీ

భర్త రాజా రఘువంశీని హత్య చేయించిన భార్య సోనమ్

AP: మీడియా స్వేచ్ఛపై పచ్చ పంజా

AP: ఆందోళన పేరుతో సాక్షి కార్యాలయాలపై దాడి

Kommineni Srinivasa Rao: నీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు

చంద్రబాబు సర్కార్ నైతిక బాధ్యత వహించాలని మహిళల డిమాండ్

Photos

+5

ఏపీలో ‘సాక్షి’ పై టీడీపీ కుట్రపూరిత దాడులు (ఫొటోలు)

+5

తిరుమలలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం (ఫొటోలు)

+5

బ్యూటీ లక్ష‍్మీ రాయ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

పెళ్లిరోజు సెలబ్రేట్‌ చేసుకున్న నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ (ఫోటోలు)

+5

యాదగిరిగుట్ట : శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కోలాహలం (ఫొటోలు)

+5

ఎంపీతో క్రికెటర్‌ రింకూ సింగ్‌ ఎంగేజ్‌మెంట్‌.. ప్రముఖుల సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మంత్రి లోకేష్‌ మోసం.. తిరగబడ్డ టీచర్లు (ఫొటోలు)

+5

మిస్‌ యూనివర్స్‌ 2025 పోటీలకు మన తెలుగు తేజాలు (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా అఖిల్‌- జైనాబ్ రిసెప్షన్‌ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి వరలక్ష్మీ దంపతులు (ఫొటోలు)