Breaking News

ఎక్కువ జీతాలొచ్చేవారికి ఐటీ నోటీసులు!!

Published on Thu, 02/19/2026 - 17:42

భారీ జీతాలు పొందుతున్న కొంతమంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ‘నడ్జ్’ నోటీసులు అందుతున్నాయి. వెల్లడించని ఆస్తి ఆదాయం, క్రిప్టో లాభాలు, ఈఎస్ఓపీ లాభాలు, విదేశీ ఆదాయం వంటి అంశాల్లో లోపాలను సరిదిద్దుకునేందుకు వీటిని జారీ చేస్తున్నారు. కఠిన చర్యలకు ముందుగా స్వచ్ఛందంగా తప్పులు సరిచేసుకునేందుకు ఇది చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఒకే రాజకీయ పార్టీకి లేదా వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వడానికి పలువురు పన్ను చెల్లింపుదారులు ఒకే చార్టర్డ్ అకౌంటెంట్ సేవలు వినియోగిస్తున్న నమూనాను శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో సంబంధిత సీఏలపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

బహుళజాతి సంస్థల సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లు సహా ఉన్నతాధికారులకు ఈ సూచనలు పంపినట్లు తెలిసింది. జరిమానాలు విధించే ముందు లోపాలను సవరించుకోవాలని శాఖ కోరుతోంది.

ఈ అంశాల్లో వ్యత్యాసాలు
విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయాన్ని ప్రకటించకపోవడం, స్టాక్-లింక్డ్ ప్రోత్సాహకాలను తక్కువగా చూపించడం, గృహ, ప్రయాణ భత్యాలను పెంచి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, విదేశీ క్లయింట్ల నుంచి క్రిప్టో రూపంలో ద్వితీయ వేతనాలు పొందడం, గుర్తింపు లేని లేదా ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు భారీ విరాళాలు ఇవ్వడం వంటి వ్యత్యాసాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

డేటా విశ్లేషణతో గుర్తింపు
ప్రస్తుత అసెస్‌మెంట్ సైకిల్‌లో అధిక ఆదాయ వర్గాల ఐటీఆర్‌లను తీవ్రంగా సమీక్షించినప్పుడు ఈ వ్యత్యాసాలు బయటపడ్డాయి. ‘గైడ్ అండ్ ఎనేబుల్’ (నడ్జ్) ప్రచారంలో భాగంగా సవరించిన ఐటీఆర్‌లు దాఖలు చేయాలని శాఖ సూచిస్తోంది.

ఆటోమేటెడ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌లు, పాన్ ఆధారిత ట్రాకింగ్ ద్వారా విదేశీ లావాదేవీల సమాచారం ప్రభుత్వానికి అందుతున్నందున తక్కువగా నివేదించడం కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు.

నడ్జ్ నోటీసు అంటే ఏమిటి?
ఇది డీఐఎన్ నంబర్‌తో కూడిన అధికారిక నోటీసు కాదు. కేవలం లోపాలు ఉన్నాయేమో పరిశీలించమనే సూచన మాత్రమే. ఐటీఆర్‌లో ప్రకటించిన ఆదాయం, ఆస్తులు సరైనవేనని నమ్మకం ఉంటే, డీఐఎన్ నంబర్‌తో అధికారిక నోటీసు అందే వరకు ఆందోళన అవసరం లేదు.

డేటా అనలిటిక్స్ ఆధారంగా ఐటీఆర్‌లో చూపిన ఆదాయం, టీడీఎస్ వివరాలు, ఇతర లావాదేవీ డేటా మధ్య వ్యత్యాసాలు గుర్తించబడుతున్నట్లు చార్టర్డ్ అకౌంటెంట్ సురేష్ సురానా చెబుతున్నారు.

ట్యాక్స్‌ పేయర్స్‌ ఏం చేయాలంటే..

  • సంబంధిత ఆర్థిక సంవత్సరాల రిటర్నులను సమీక్షించాలి

  • పూర్తి లావాదేవీ వివరాలు సేకరించాలి

  • అవసరమైతే సెక్షన్ 139(8A) కింద నవీకరించిన రిటర్న్ (ఐటీఆర్-యు) దాఖలు చేయాలి

  • వడ్డీతో పాటు అదనపు పన్ను చెల్లించాలి

ఇలా చేయడం ద్వారా తదుపరి విచారణ, జరిమానాలు లేదా ప్రాసిక్యూషన్ వంటి కఠిన చర్యల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Videos

ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్

దేవుడితో పెట్టుకున్నాడు చుక్కలు చూస్తున్నాడు

వైరల్ గా మారిన ఆలియా భట్ డ్రెస్..

Tirumala : రెండు కాదు ఏడు కొండలే.. అసలు నిజాలు బయటపెట్టిన జగన్

జగనన్న కాలనీల కోసం.. అక్కచెల్లెమ్మలకు ఏకంగా 35,210 కోట్లు ఇచ్చాం

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఉరి.. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇక దేవుడికే తెలియాలి

ఏమయ్యా అచ్చెన్న.. 6,309 కోట్లు ఇచ్చావా ..? సిగ్గుందా కొంచెమైనా..!

వారణాసిలో కిచ్చా సుదీప్ రోల్ ఏంటంటే..?

ఇందాపూర్ డెయిరీ రూపంలో బయటపడ్డ బాబు కల్తీ కుట్ర

మహేష్ బాబు NEXT మూవీ ఫిక్స్.. అంత్యంత క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా!

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ త్రిష (ఫోటోలు)

+5

పట్టుచీరలో అందంగా సోనియా ఆకుల (ఫోటోలు)

+5

శివబాలాజీ-మధుమిత కుమారుడికి మోహన్‌బాబు ఆశీస్సులు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)

+5

హీరోయిన్ నయన్ సారిక బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

స్టన్నింగ్‌ ఔట్‌ఫిట్‌తో సమంత.. వైరల్‌ ఫోటోలు

+5

విశాఖ సాగరతీరంలో సాహస గర్జన (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో రంజాన్‌ శోభ (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం (ఫొటోలు)

+5

‘విష్ణు విన్యాసం’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)