Breaking News

50 లక్షల మంది.. రూ.26.55 కోట్లు దాటిన లావాదేవీలు!

Published on Sat, 02/07/2026 - 16:03

2025 ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్‌' (FASTag Annual Pass) ప్రారంభమైంది. ఇది అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. ఆ తరువాత కూడా ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు తాజాగా 50 లక్షల మంది దీనిని కొనుగోలు చేసినట్లు.. ప్రారంభించిన ఆరు నెలల్లోనే 26.55 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది.

అగ్రస్థానంలో చండీగఢ్
రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) వివరాల ప్రకారం.. ప్రస్తుతం జాతీయ రహదారుల (NH) నెట్‌వర్క్‌లో కార్ల ద్వారా జరిగే మొత్తం లావాదేవీల్లో సుమారు 28 శాతం ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే, చండీగఢ్ ఈ పాస్ వినియోగంలో అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం వార్షిక పాస్ లావాదేవీల్లో 14 శాతం చండీగఢ్ నుంచే నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో తమిళనాడు (12.3 శాతం) & ఢిల్లీ (11.5 శాతం) ఉన్నాయి.

టోల్ ప్లాజాల విషయానికి వస్తే.. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని బిజ్వాసన్ ఫీ ప్లాజా అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ దాదాపు 57 శాతం కార్ల రాకపోకలు యాన్యువల్ పాస్ ద్వారానే జరుగుతున్నాయి. ముండకా ఫీ ప్లాజా (ఢిల్లీ ఎన్‌సీఆర్) & జిన్‌ఝోలీ ఫీ ప్లాజా (సోనిపట్) వద్ద కూడా సుమారు 53 శాతం నాన్-కమర్షియల్ వాహనాలు ఈ పాస్‌ను ఉపయోగిస్తున్నాయి.

1,150 టోల్ ప్లాజాల్లో.. యాన్యువల్ పాస్‌
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్‌ప్రెస్‌వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్‌ను అమలు చేసింది.

వాహనదారులు ఫాస్టాగ్‌లో డబ్బులు అయిపోయిన ప్రతిసారి రీచార్జ్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రూ.3 వేలు చెల్లించి వార్షిక ఫాస్టాగ్‌ రీచార్జ్‌ చేసుకుంటే 200 ట్రిప్పులు లేదంటే ఏడాది గడువుతో (ఏది ముందు అయితే అది) ఈ పాస్‌ వర్తిస్తుంది. వాహనదారులు కొత్తగా ఫాస్టాగ్‌ కొనాల్సిన అవసరం లేకుండా.. ప్రస్తుతం వాహనంపై అతికించిన ఫాస్టాగ్‌కే ఆ మొత్తాన్ని రీచార్జ్‌ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఇదీ చదవండి: భారత్ - అమెరికా డీల్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

Videos

రాజు ఎక్కడున్నా రాజే.. చెన్నైలో వైఎస్ జగన్ ప్రభంజనం

నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని ములాఖత్ లో కలిసిన చెవిరెడ్డి

రాంబాబు భౌతికకాయానికి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ నేతలు

పవన్ కల్యాణ్ ఇప్పుడే గుర్తొచ్చారా? అంబటి మౌనిక అదిరిపోయే రిప్లై

50 మంది విద్యార్థులకు అస్వస్థత.. రంపచోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలింపు

సౌందర్యతో సినిమా నా జన్మ ధన్యమైంది.. 365 రోజులు ఆడిందంటే నేనే నమ్మలేదు

ఈ నెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తిరుమల లడ్డు ప్రసాదంపై ది వైర్ వెబ్ సైట్ సంచలన కథనం

చంద్రబాబు, పవన్ కుట్రలు చేస్తున్నారు.. కూటమిలో భయం మొదలైంది

టీడీపీ నేతలే షాక్ అయ్యేలా ఎల్లో భజన చేస్తున్న జనసేన బ్యాచ్

Photos

+5

వైట్ టాప్ లో టాప్ లేపుతున్న జాక్వెలిన్.. గ్లామర్ (ఫొటోలు)

+5

సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈజలపాతం తెలుసా.. కదిలే వంతెనలు..అదిరే గుండెలు (ఫొటోలు)

+5

కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సాయి పల్లవి, శ్రీలీల (ఫొటోలు)

+5

అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)

+5

ఐస్‌క్రీం ఈవెంట్ లో సినీ నటి రీతూవర్మ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఆభరణాల ప్రదర్శనలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)

+5

హైదరాబాద్ : షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ (ఫొటోలు)