Breaking News

వస్తు సేవల పన్ను విజయాల పరంపర

Published on Tue, 07/01/2025 - 16:50

భారత్‌లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను జులై 1, 2017న ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక ఏకీకరణ దిశగా సాహసోపేతమైన అడుగు పడిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఎనిమిదేళ్ల తరువాత 2025లో జీఎస్టీ విధానం దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన పన్ను సంస్కరణల్లో ఒకటిగా నిలుస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడం, పారదర్శకతను పెంచడం, వృద్ధిని పెంపొందించేందుకు విలువ ఆధారిత పన్నులు(వ్యాట్‌) స్థానంలో జీఎస్టీని ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అప్పటి నుంచి నేటి వరకు జీఎస్టీ సాధించిన కొన్ని విజయాల గురించి తెలుసుకుందాం.

ఒకే దేశం, ఒకే పన్ను

జీఎస్టీ అమలు ద్వారా 17 వేర్వేరు పన్నులు, 13 సెస్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. దాంతో గతంలో రాష్ట్రాల్లో ఉన్న పరోక్ష పన్నుల భారం తొలగిపోయింది. ఈ సమన్వయం ఒక ఉమ్మడి జాతీయ విధానాన్ని సృష్టించింది. లాజిస్టిక్స్ ఖర్చులను గణనీయంగా తగ్గించింది. రాష్ట్రాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేసింది.

రికార్డు స్థాయిలో ఆదాయ వృద్ధి

2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు 9.4 శాతం పెరిగి చరిత్రాత్మకంగా  రూ.22.08 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బలమైన యంత్రాంగాలు, భారతదేశం క్రమంగా విస్తరిస్తున్న ఆర్థిక కార్యకలాపాల కారణంగా నెలవారీ వసూళ్లు ప్రస్తుతం సగటున రూ.1.84 లక్షల కోట్లుగా ఉంది.

ట్యాక్స్ నమోదులో పెంపు

ఏప్రిల్ 2025 నాటికి జీఎస్టీ 1.51 కోట్లకు పైగా యాక్టివ్ రిజిస్ట్రేషన్లను కలిగి ఉంది. చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌.. వంటివాటిని పన్ను పరిధిలోకి తీసుకురావడం ద్వారా దేశాన్ని మరింత పారదర్శక ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు.

డిజిటల్ ఫైలింగ్

జీఎస్టీ విధానం పన్ను సమ్మతిని మరింత సులభతరం చేసింది. కేంద్రీకృత ఆన్‌లైన్‌ పోర్టల్, మొబైల్ అప్లికేషన్లు, క్యూఆర్ఎంపీ (క్వార్టర్లీ రిటర్న్స్ విత్ మంత్లీ పేమెంట్) వంటి పథకాలతో రిటర్నులను దాఖలు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా ఈ విధానాల ద్వారా చిన్న, మధ్యతరహా సంస్థలకు ఎంతో మేలు జరుగుతోంది.

సహకార విధానం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పన్నుల వ్యవస్థను నడిపించేలా జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటి వరకు 55కి పైగా సమావేశాలు నిర్వహించింది. ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వేదిక సహకారాన్ని పెంపొందించడమే కాకుండా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక అవసరాలను తీర్చేలా వీలు కల్పించింది.

ఇదీ చదవండి: అత్యంత కుబేరులున్న నగరాల జాబితా విడుదల

సవాళ్లు లేవా..

జీఎస్టీ పన్ను వ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చినప్పటికీ రేట్ల సరళీకరణ, కాంప్లయన్స్ లోపాలను పరిష్కరించడం, ఐటీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి సవాళ్లు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ, ఈ వ్యవస్థ మరింత సమర్థవంతమైన, ఏకీకృత, పారదర్శక పన్ను విధానానికి పునాది వేస్తుంది.

Videos

పాకిస్తాన్ తో యుద్ధాన్ని ఎందుకు ఆపేశారు? కాంగ్రెస్ సూటి ప్రశ్నకు బీజేపీ రిప్లై ఏంటి?

ఈడీ విచారణపై అల్లు అరవింద్ క్లారిటీ

ఈ ఘటన చూసి నా కళ్ళలో నీళ్లు వచ్చాయి.. ఎంపీ తనుజారాణి ఎమోషనల్

వైఎస్ జగన్ ను కలవొద్దని మామిడి రైతులను కూటమి నేతలు బెదిరిస్తున్నారు

మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: రాంచందర్రావు

ఈనెల 9న చిత్తూరు జిల్లాలో YS జగన్ పర్యటన: పెద్దిరెడ్డి

20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి ఠాక్రే వారసులు

గంటాపై ఫిర్యాదు చేసిన భీమిలి నియోజకవర్గ నేతలు

వల్లభనేని వంశితో అభిమానుల ఫోటోలు

ఏపీలో నరకాసుర పాలన: పేర్ని నాని

Photos

+5

ఆద్యంతం ఉత్కంఠను రేపే మిస్టరీ పర్యాటక ప్రదేశాలివే..! (ఫోటోలు)

+5

విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్‌ డ్రిల్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌లో చుక్కలు (ఫొటోలు)

+5

ఆషాడమాసం.. విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ (ఫోటోలు)

+5

ఆరునెలల జ్ఞాపకాలు పంచుకున్న ప్రభాస్‌ సోదరి (ఫోటోలు)

+5

'అఖండ' కోసం తెలుగులో ఎంట్రీ ఇచ్చేసిన నటి హర్షాలీ మల్హోత్రా (ఫోటోలు)

+5

గర్భాలయంలో ఏడడుగుల విగ్రహం.. ఏపీలో ఈ పురాతన ఆలయం గురించి విన్నారా? (చిత్రాలు)

+5

నలుగురు టాప్‌ హీరోయిన్లతో ధనుష్‌ పార్టీ.. ఎందుకో తెలుసా (ఫోటోలు)