Breaking News

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..మాట మార్చిన సీఈఓ!

Published on Wed, 11/09/2022 - 15:02

కరోనా మహ్మమారి రాకతో చాలా రంగాలు డీలా పడిన సంగతి తెలిసిందే. అయితే వైరస్‌ తగ్గుమఖం పట్టాక పరిస్థితులు తిరిగి యధావిధిగా కొనసాగుతాయని అంతా భావించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని పరిణామాల దృష్ట్యా పలు రంగాల పూర్తిగా కోలుకోవాల్సి ఉంది. ఇటీవల జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఐటీ రంగంలో ఏం జరుగుతుందనేది అర్థం కావడం లేదు. ప్రముఖ దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఎడ్యుటెక్‌ సేవల సంస్థ అనకాడమి మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.

ఇదివరకే 600 మంది సిబ్బందికి ఉద్వాసన పలకగా.. తాజాగా మరో 350 మంది ఉద్యోగులపై వేటు వేయనుంది. ఈ ఎడ్టెక్ స్టార్టప్ కంపెనీ ఖర్చులను తగ్గించి లాభాలను ఆర్జించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ఇది మూడవ రౌండ్‌లో జరుగుతున్న తొలగింపులు. దీనికి సంబంధించి కంపెనీ సీఈవో గౌరవ్‌ ముంజల్‌ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో.. కంపెనీ ఖర్చులను తగ్గించే క్రమంలో (కాస్ట్‌ కటింట్‌) క్రమంలో మా అత్యంత ప్రతిభావంతులైన కొంతమంది అనాకాడెమీ ఉద్యోగులకు వీడ్కోలు చెప్పాల్సి వస్తోంది. ఈ విషయాన్ని పంచుకోవడం నాకు చాలా బాధగా ఉంది. 

ప్రస్తుతం తొలగింపుకు సంబంధించి ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నాను. గతంలో లేఆఫ్స్ చేపట్టకూడదని తాము నిర్ణయించాం. అయితే మార్కెట్ సవాళ్లు వల్ల మా నిర్ణయాలను పునఃపరిశీలించవలసి వచ్చింది. పైగా ఇటీవల పెద్ద మొత్తంలో సంస్థ కోర్ వ్యాపారాలన్ని కూడా ఆఫ్‌లైన్‌కి మారిపోయాయని ముంజల్‌ తెలిపారు. జూలైలో గౌరవ్ ముంజాల్ అన్‌అకాడమీలో లేఆఫ్స్ ఉండవని ఉద్యోగులకు తెలిపారు. కానీ ఈ విషయంలో ఆయన మాట తప్పడంతో క్షమాపణలు కూడా చెప్పారు.

చదవండి: ఆ ఐఫోన్‌ను కొనే దిక్కులేదు!..తయారీ నిలిపేసిన ‘యాపిల్‌’!

Videos

గిల్ కోసం కోహ్లి బలి.. ఇదంతా గంభీర్ కుట్ర!

జమ్మూలోని సరిహద్దు గ్రామాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్

స్పీడ్ పెంచిన మెగా స్టార్.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు

రాజమౌళి సెంటిమెంట్ కి భయపడుతున్న మహేష్ బాబు

ఉగ్రవాదులతోనే మా పోరాటం

భారత్, పాకిస్థాన్ DGMOల భేటీ వాయిదా

దేశంలో 32 విమానాశ్రయాలు రీఓపెన్

బాహుబలి చేప

అందుకే.. తాగుడు వద్దురా అనేది

అనగనగా మూవీ టీమ్ తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ

Photos

+5

నందమూరి తారక రామారావు ఎంట్రీ సినిమా పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

తిరుపతి: గంగమ్మ జాతర.. మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆర్కే బీచ్‌లో సందర్శకుల సందడే సందడి (ఫొటోలు)

+5

యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ.. భారీగా పాల్గొన్న భక్తులు (ఫొటోలు)

+5

వీరజవాన్‌ మురళీ నాయక్‌ అంతిమ వీడ్కోలు.. జైహింద్‌.. అమర్‌రహే నినాదాలు (ఫొటోలు)

+5

‘లెవన్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మిస్‌ వరల్డ్‌ : అందాల ముద్దుగుమ్మలు సందడి.. (ఫొటోలు)

+5

తిరుమల దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

మదర్స్ డే స్పెషల్.. హీరోయిన్ ప్రణీత పిల్లల్ని చూశారా? (ఫొటోలు)

+5

డాక్టర్ బాబు నిరుపమ్‌ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)