Breaking News

ఎవలాన్‌ టెక్నాలజీస్‌ ఐపీవో

Published on Mon, 03/27/2023 - 00:40

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ తయారీ సర్వీసుల కంపెనీ ఎవలాన్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఏప్రిల్‌ 3న ప్రారంభంకానున్న ఇష్యూ 6న ముగియనుంది. తద్వారా కంపెనీ రూ. 865 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఈ నెల 31న షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 545 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.

షేర్ల జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కాగా.. తొలుత ఐపీవో ద్వారా రూ. 1,025 కోట్ల సమీకరణకు కంపెనీ ప్రణాళికలు వేసింది. అయితే ఇష్యూ కంటే ముందుగా షేర్ల ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ. 160 కోట్లు సమకూర్చుకుంది. రూ. 80 కోట్లు తాజా ఈక్విటీ, మరో రూ. 80 కోట్లు సెకండరీ షేర్ల అమ్మకం ద్వారా ఈ నిధులు అందుకుంది. వీటిలో యూనిఫై ఫైనాన్షియల్‌ ప్రయివేట్‌ లిమిటెడ్, అశోకా ఇండియా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ నుంచి రూ. 60 కోట్లు చొప్పున లభించగా.. ఇండియా ఎకార్న్‌ ఫండ్‌ నుంచి రూ. 40 కోట్లు సమకూరినట్లు ఎవలాన్‌ వెల్లడించింది.  

1999లో షురూ..
ఎండ్‌టుఎండ్‌ ఎలక్ట్రానిక్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ సర్వీస్‌ సొల్యూషన్లు అందిస్తున్న ఎవలాన్‌ 1999లో ఏర్పాటైంది. కంపెనీ క్లయింట్లలో క్యోసన్‌ ఇండియా, జోనర్‌ సిస్టమ్స్‌ ఇంక్, కొలిన్స్‌ ఏరోస్పేస్, ఈ ఇన్ఫోచిప్స్, యూఎస్‌ మలబార్‌ కంపెనీ, మెగ్గిట్, సిస్టెక్‌ కార్పొరేషన్‌ తదితరాలున్నాయి. యూఎస్‌తోపాటు దేశీయంగా 12 తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. 2021–22లో రూ. 840 కోట్ల ఆదాయం సాధించింది. 2022 జూన్‌కల్లా రూ. 1,039 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది.

Videos

ఎక్కడికైనా వెళ్తామ్.. ఉగ్రవాదులను అంతం చేస్తామ్

ఒంగోలులో మంత్రి నారా లోకేశ్ కు నిరసన సెగ

ఏంటీ త్రివిక్రమ్ - వెంకటేష్ సినిమాకు అలాంటి టైటిలా?

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి సుప్రీంకోర్టు సీరియస్

సింహాచలం ఘటనలో మృతుల కుటుంబానికి YSRCP తరుపున ఆర్థిక సహాయం అందజేత

సమస్య చెప్పు కోవడానికి వచ్చిన రైతు పట్ల మైలవరం MLA వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం

మురళీ నాయక్ మరణం తీరని లోటు YSRCP వెంకటరామి రెడ్డి కామెంట్స్

సుప్రీంకోర్టు తీర్పుపై పలు ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి

KSR Live Show: పథకాలకు నో మనీ.. జల్సాలకు ఫుల్ మనీ..!

హైదరాబాద్ సహా పలు చోట్ల మోస్తారు వర్షం

Photos

+5

తెలంగాణ : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం (ఫొటోలు)

+5

అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)

+5

#MissWorld2025 : బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)

+5

ఈ తీపి గుర్తులు మరిచిపోలేను‌.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

జాతరలో నిర్లక్ష్యం గంగమ్మ జాతరకు భారీగా భక్తులు..(ఫొటోలు)

+5

వరంగల్‌ : కాకతీయ వైభవాన్ని చూసి మురిసిన విదేశీ వనితలు (ఫొటోలు)

+5

Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

+5

Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)