Breaking News

ఈ స్కూటర్ల ఓనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన కంపెనీ

Published on Thu, 09/18/2025 - 18:05

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థ ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ తమ కస్టమర్లకు మంచి కబురు చెప్పింది. దేశవ్యాప్తంగా 500 ఎక్స్ పీరియన్స్ సెంటర్ (ఈసీ)లను అధిగమించింది. ఇది దాని రిటైల్ విస్తరణలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. గత మూడు నెలల్లో (జూన్-ఆగస్టు 2025), ఏథర్ 101 కొత్త ఈసీలను జోడించింది.

"మా వృద్ధి భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ మొబిలిటీకి పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది" అని ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ సింగ్ ఫోకెలా అన్నారు. "దక్షిణ భారతదేశం మా కంచుకోటగా నిలిచినప్పటికీ, రిజ్తా విజయం టైర్-2, 3 నగరాల్లో మా విస్తరణను వేగవంతం చేసింది" అన్నారు.

ఆగ్రా, జబల్పూర్, బిలాస్పూర్, వడోదర, సుందర్గఢ్ వంటి నగరాల్లో ఏథెర్ ఇప్పుడు ఈసీలను కలిగి ఉంది. అలాగే కాలికట్, గుంటూరు, హల్ద్వానీ, కోటా వంటి పట్టణాల్లోకి చొచ్చుకుపోయింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఒక్కో చోట 50కి పైగా ఈసీలు ఉన్నాయి. బెంగళూరులో ఏకంగా 18 కేంద్రాలు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఏథర్ మార్కెట్ వాటా 2026 తొలి త్రైమాసికంలో 14.3 శాతానికి  పెరిగింది. గత సంవత్సరం ఇది 7.6% ఉండగా రెట్టింపు అయింది. మధ్య భారతదేశంలో వాటా 10.7 శాతానికి పెరిగగా, దక్షిణ భారతదేశంలో 22.8 శాతంతో ఆధిపత్యాన్ని చాటింది.

ఏథర్ పోర్ట్ ఫోలియోలో పనితీరు-ఆధారిత 450 సిరీస్,  ఫ్యామిలీ-ఫోకస్డ్ రిజ్టా ఉన్నాయి. అథెర్ కమ్యూనిటీ డే 2025లో ఇది తన నెక్స్ట్-జెన్ ఈఎల్‌ ప్లాట్ ఫామ్, ఏథర్ స్టాక్ 7.0, ఇన్ఫినిట్ క్రూయిజ్, పోథోల్ అలర్ట్స్ వంటి కొత్త ఫీచర్లను ఆవిష్కరించింది.

తమిళనాడులోని హోసూర్ లో ఏథర్ రెండు ప్లాంట్ లను నిర్వహిస్తోంది. మహారాష్ట్రలోని బిడ్కిన్ లో మూడవ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది మొత్తం సామర్థ్యాన్ని సంవత్సరానికి 1.42 మిలియన్ యూనిట్లకు పెంచుతుంది. భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఈసీలను 700లకు పైగా పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Videos

ఉడతతో స్నేహం

సాక్షి రిపోర్టర్ పై పోలీసుల దౌర్జన్యం

మెడికల్ కాలేజీలు పేదల కోసం.. బినామీలకు ఇస్తానంటే ఊరుకోము

Watch Live: ఛలో మెడికల్ కాలేజ్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెళ్లి తీరుతా.. బైరెడ్డి మాస్ వార్నింగ్

17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట

అమెరికాలో తెలంగాణ వాసి మృతి

మహేష్ తో ప్రభాస్ డైరెక్టర్.. స్క్రీన్స్ బ్లాస్ట్ పక్కా

మీలాంటి దుష్ట శక్తులనుండి ప్రజలను కాపాడాలని ఆ అప్పన్న స్వామిని వేడుకుంటున్నా

గుర్తుపెట్టుకో.. మేమే నిన్ను గెలిపించాం.. మేమే వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడిస్తాం

Photos

+5

విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్ రోడ్డుపై అడవి జంతువులు..అవునా.. నిజమా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ట్రాఫిక్‌ సమ్మిట్‌–2025..ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)