Breaking News

అదానీ మెగా బ్యాటరీ స్టోరేజ్‌!

Published on Wed, 11/12/2025 - 02:03

న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ పునురుత్పాదక (రెన్యూవబుల్‌) ఇంధన రంగంలో మరిన్ని భారీ ప్రణాళికలకు తెరతీసింది. బ్యాటరీ విద్యుత్‌ స్టోరేజీ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా గుజరాత్‌లోని ఖావ్డాలో 1,126 మెగావాట్లు/3,530 మెగావాట్‌అవర్‌ (ఎండబ్ల్యూహెచ్‌) సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (బీఈఎస్‌ఎస్‌)ను నెలకొల్పనున్నట్లు పేర్కొంది.

ఇది ప్రపంచంలోనే భారీ స్టోరేజ్‌ ప్రాజెక్టుల్లో ఒకటిగా, భారత్‌లో అతిపెద్ద కేంద్రంగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్టోరేజ్‌ కేంద్రంలో 700కు పైగా బీఈఎస్‌ఎస్‌ కంటెయినర్లు ఉంటాయని, మొత్తం ప్రాజెక్ట్‌ 2026 మార్చి నాటికి సిద్ధమవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఇదే చోట నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక  విద్యుత్‌ ప్లాంట్‌ సముదాయంలో భాగంగానే తాజా ప్రాజెక్టును అదానీ చేపడుతోంది. 

బ్యాకప్‌ అవసరాలకు... 
రెన్యూవబుల్‌ విద్యుత్‌ను మరింత నమ్మకమైన ఇంధన వనరుగా ఉపయోగించుకోవడంతో పాటు బ్యాకప్‌ పవర్‌ను అందించడానికి, గ్రిడ్‌ స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి బ్యాటరీ స్టోరేజ్‌ చాలా అవసరం. సౌర, పవన తదితర వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను నిల్వ చేసి, అవి అందుబాటులో లేని సమయాల్లో, అంటే రాత్రి పూట లేదా తక్కువ గాలి వేగం ఉండే సమయాల్లో ఉపయోగించుకోవడానికి బ్యాటరీ స్టోరేజ్‌ వీలు కల్పిస్తుంది. దీనివల్ల గ్రిడ్‌పై, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది, అదేవిధంగా కరెంట్‌ బిల్లులు తగ్గడంతో పాటు నిరంతర విద్యుత్‌ సరఫరాకు తోడ్పడుతుంది.

’గ్రిడ్‌పై మరింత విశ్వాసం పెంచడంతో పాటు, పీక్‌ లోడ్‌ ఒత్తిళ్లను తగ్గించడం, సరఫరాపరమైన సమస్యలకు చెక్‌ పెట్టడం, రోజంతా పర్యావరణహిత విద్యుత్‌ అందించడాన్ని ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. మరింత మెరుగైన పనితీరు కోసం విద్యుత్‌ నిర్వహణ వ్యవస్థలతో అనుసంధానించిన అధునాతన లిథియం–అయాన్‌ బ్యాటరీ టెక్నాలజీని ఇందులో వినియోగించడం జరుగుతుంది’ అని అదానీ గ్రూప్‌ వెల్లడించింది. ఈ బీఈఎస్‌ఎస్‌ ప్రాజెక్టులో 3,530 ఎండబ్ల్యూహెచ్‌ విద్యుత్‌ను నిల్వ చేయగలుగుతారు, అంటే 1,126 మెగావాట్ల విద్యుత్‌ను 3 గంటల పాటు సరఫరా చేయడానికి వీలవుతుంది. కాగా, 2027 ఆర్థిక సంవత్సరం నాటికి స్టోరేజ్‌ సామర్థ్యాన్ని 15 జీడబ్ల్యూహెచ్‌కు, ఐదేళ్లలో 50 జీడబ్ల్యూహెచ్‌కు పెంచే ప్రణాళికల్లో ఉన్నట్లు అదానీ గ్రూప్‌ పేర్కొంది.

చరిత్రాత్మక ప్రాజెక్ట్‌... 
పునరుత్పాదక విద్యుత్‌ భవిష్యత్తుకు ఎనర్జీ స్టోరేజ్‌ అత్యంత కీలకమైనది. ఈ చరిత్రాత్మక ప్రాజెక్ట్‌ అనేది ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పడమే కాకుండా భారతదేశ ఇంధన అవసరాలు, పునరుత్పాదక విద్యుత్‌ విషయంలో మన నిబద్ధతను మరింత చాటి చెబుతుంది.     – గౌతమ్‌ అదానీ, అదానీ గ్రూప్‌ చైర్మన్‌

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు