2030 నాటికి మూడో అతి పెద్ద ఎకానమీగా భారత్‌ - ఆకాంక్షల సాధనకు అదానీ గ్రూప్‌

Published on Tue, 01/30/2024 - 08:03

న్యూఢిల్లీ: 2030 నాటికల్లా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఎదగాలన్న భారత్‌ ఆకాంక్షల సాధనకు అదానీ గ్రూప్‌ కీలకంగా ఉండనున్నట్లు అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ క్యాంటర్‌ ఫిట్జ్‌గెరాల్డ్‌ అండ్‌ కంపెనీ ఒక నివేదికలో తెలిపింది. వేగంగా విస్తరిస్తున్న అదానీ గ్రూప్‌ .. మౌలిక రంగ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (ఏఈఎల్‌) 50 శాతం పైగా లాభాలను అందించగలదని కంపెనీపై కవరేజీని ప్రారంభిస్తూ జనవరి 28న రాసిన నోట్‌లో వివరించింది. 

‘ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారతదేశం 2030 నాటికల్లా మూడో అతి పెద్ద ఎకానమీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్కడికి చేరుకోవాలంటే భారత్‌ ఇటు డిజిటల్‌ అటు భౌతిక మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్‌ చేయాలి. ఇంధన వినియోగం పెరుగుతుంది కాబట్టి ఉత్పత్తి కూడా పెరగాలి. భారత్‌ ఆకాంక్షిస్తున్న వాటన్నింటి సాధనకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కీలకమైనదిగా ఉంటుంది‘ అని క్యాంటర్‌ పేర్కొంది.

భారీ పోర్ట్‌ఫోలియో..
ఎయిర్‌లైన్‌ ప్యాసింజర్‌ ట్రాఫిక్‌లో దాదాపు 25 శాతం వాటా, కార్గోలో 33 శాతం వాటా ఉండే ఎనిమిది ఎయిర్‌పోర్టులు అదానీ గ్రూప్‌ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా అనేక డేటా సెంటర్లు నిర్మిస్తోంది. 5,000 కి.మీ. మేర రహదారుల నిర్మాణానికి కాంట్రాక్టులు ఉన్నాయి. ఏఈఎల్‌ రిస్కు–రివార్డుల నిష్పత్తి ప్రస్తుత స్థాయిలో ఆకర్షణీయంగా ఉన్నట్లు క్యాంటర్‌ వివరించింది. 

దేశీయంగా పబ్లిక్‌గా ట్రేడవుతున్న అతి పెద్ద నాన్‌–ఫైనాన్షియల్‌ కంపెనీల్లో 10వ స్థానంలో ఉన్నప్పటికీ ఏఈఎల్‌పై దాదాపుగా అనలిస్టు కవరేజీ లేకపోవడమనేది అదానీ గ్రూప్‌ సంస్థలపై ఇన్వెస్టర్లలో అంతగా అవగాహన లేకపోవడానికి కారణమని పేర్కొంది. 

హిండెన్‌బర్గ్‌ నివేదికతో తీవ్రమైన ఆందోళనలు తెరపైకి వచ్చినప్పటికీ .. గవర్నెన్స్‌ను, పారదర్శకతను మెరుగుపర్చుకునేందుకు, లిక్విడిటీ రిస్కులను తగ్గించుకునేందుకు కంపెనీ చర్యలు తీసుకుందని నోట్‌లో క్యాంటర్‌ తెలిపింది. ‘ప్రస్తుత దశలో విస్మరించ వీలు లేనంత పెద్ద గ్రూప్‌ అదానీది. అదానీకి దేశం అవసరం ఎంత ఉందో భారత్‌కి కూడా అదానీ అవసరం అంతే ఉందని మేము భావిస్తున్నాం‘ అని పేర్కొంది.

Videos

రాజసింగ్‌కు బెదిరింపు కాల్స్

12 లక్షల విలువైన వజ్రాలు ఈ నెలలో 20 లభ్యం

ప్రగతి భవన్ కు బాంబు బెదిరింపు నిందితుడు అరెస్ట్

తప్పుడు పనుల కోసమే బీజేపీతో టీడీపీ పొత్తు

పిల్లలను కొన్న వారి పై కేసులు బయటపడ్డ ముఠా ఆడియో

అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ తిరస్కరించిన సుప్రీం

1200 వందల ప్రముఖుల ఫోన్లు ట్యాప్ నిజాలు ఒప్పుకున్నా ప్రణీత్ రావు

మళ్లీ జగనే.. నో డౌట్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై కేంద్ర ఈసీకి ఫిర్యాదు చేసిన YSRCP నేతలు

పాపం పసివాళ్లు

Photos

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024కు ముందు భార్య అనుష్కతో కోహ్లి చక్కర్లు.. ఫొటోలు వైరల్‌

+5

హీరోయిన్‌ మూడో పెళ్లి.. తెలుగులోనూ నటించింది (ఫోటోలు)

+5

11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్‌ కపుల్‌.. కుమారుడి కోసం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరో ఆశిష్‌ (ఫొటోలు)

+5

ఎలక్షన్ కమిషన్ నిబంధనలపై పేర్ని నాని రియాక్షన్

+5

Anasuya Sengupta: 'కేన్స్‌'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు)

+5

నేను బతికే ఉన్నా.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ (ఫొటోలు)