Breaking News

వైఎస్సార్‌సీపీ హయాంలోనే సామాజిక న్యాయం

Published on Sun, 04/20/2025 - 03:41

సాక్షి, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన ఏకైక పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అని ఆ పార్టీ బీసీ విభాగం నేతలు కొనియాడారు. పార్టీ నేతలెవరైనా కాలర్‌ ఎగరేసుకుని తిరిగేలా వైఎస్‌ జగన్‌ పాలించారని చెప్పారు. సామాజిక న్యాయం విషయంలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశా­రు. వ్యవస్థాగతంగా మరింత బలోపేతం అవుదామని చెప్పా­రు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో శనివారం ఆ పార్టీ బీసీ విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. 

మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ మాట్లాడుతూ.. బీసీలు ఎవరికీ భయపడనవసరం లేదన్నారు. బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ కాదని.. బ్యాక్‌ బోన్‌ క్లాసెస్‌ అని మన నాయకుడు జగన్‌ నిర్వచించారన్నారు. కూటమి పాలనలో అరాచకాలు అణగారిన వర్గాలపైనే ఎక్కువగా జరిగాయని చెప్పారు. అనంతపురం జిల్లాలో బీసీ నేత కురుబ లింగమయ్యను దారుణంగా చంపా­రని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ పాలనలో బీసీ కులాలు ఆత్మగౌరవంతో జీవించాయన్నారు. 

అన్ని రంగాల్లోనూ అవకాశాలను అందుకుని, రాజ్యాధికారాన్ని అనుభవించాయని గుర్తు చేశారు. పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్య­క్షుడు, ఎమ్మెల్సీ రాచగొల్ల రమేష్‌ యాదవ్‌ మాట్లా­డుతూ.. వైఎస్సార్‌సీపీ పాలన బీసీలకు స్వర్ణయుగం అని కొనియాడారు. బీసీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నౌడు వెంకటరమణ మాట్లాడుతూ.. కూటమి పార్టీలకు బీసీల సత్తా చూపిద్దాం అన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. పూలే ఆశయాలను జగనన్న కొనసాగించారని చెప్పారు. మాజీ మంత్రి కారు­మూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కూటమి సూపర్‌ సిక్స్‌ మోసాలను బయటపెడతామని చెప్పారు.   

కూటమి దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం 
సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం అందించి ప్రగతికి బాటలు వేయాలని అన్ని రాజకీయ పార్టీలు చెబుతాయని, దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించింది ఒక్క వైఎస్సార్‌సీపీనే అని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమం విషయంలో వైఎస్‌ జగన్‌  చెప్పనివి కూడా చేసి ఆ తర్వాత ప్రజల వద్దకు వెళ్లారని గుర్తు చేశారు. చంద్రబాబుది అవకాశవాద రాజకీయమని, అధికారంలోకి రాగానే దోచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారని విమర్శించారు. 

కూటమి  దుష్ప్రచారాన్ని తిప్పికొడదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనను ప్రజల్లోకి తీసుకెళదామని చెప్పారు. వ్యవస్థాగతంగా మరింత బలోపేతం అవుదామని, గతంలో కంటే మెరుగ్గా పూర్తి స్థాయి కమిటీలు నియమించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, పలువురు సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)