అర్హులందరికీ ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’

Published on Sun, 11/08/2020 - 02:47

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాపు నేస్తం పథకంలో భాగంగా కొత్తగా అర్హులైన 95,245 మంది మహిళా లబ్ధిదారులకు రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.142.87 కోట్లను నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లోకి నగదును రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ శనివారం విజయవాడలో ప్రారంభించారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా కొత్తగా గుర్తించిన మహిళా లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేశారు. మొదటి విడతలో ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హత ఉండి అనుకోని కారణాల వల్ల దరఖాస్తు చేయని వారికి, అందుబాటులో లేని వారికి, జాబితాలో పేర్లు లేని వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా కొత్తగా 95,245 మంది మహిళా లబ్ధిదారులను గుర్తించి రూ.142.87 కోట్లను నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు 2,35,360 మంది కాపు మహిళా లబ్ధిదారులకు రూ.353 కోట్లను విడుదల చేయడం తెలిసిందే. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ద్వారా 2019–20 సంవత్సరానికి గాను మొత్తంగా 3,30,605 మంది లబ్ధిదారులకు రూ.495.87 కోట్లను ప్రభుత్వం ఆర్థిక సాయం కింద అందించినట్లైంది. 
లబ్ధిదారులకు చెక్కు ఇస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణ, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌  జక్కంపూడి తదితరులు 

అవినీతికి తావులేని విధంగా పేదలకు ఆర్థిక సాయం
ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతికి తావులేని విధంగా పేదలకు ఆర్థిక సాయం అందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదర్శ పాలకుడిగా నిరూపించుకున్నారన్నారు. కేంద్రం ఇచ్చిన ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌ రిజర్వేషన్‌ల నుంచి 5% కాపులకు ఇస్తున్నానని చెప్పి వారిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. కాపులు వారి సమస్యలపై ఉద్యమిస్తే.. కేసులు పెట్టి వేలాది మందిని చంద్రబాబు జైళ్లలో పెట్టించారని, ఆ కేసులన్నీ ముఖ్యమంత్రి జగన్‌ ఎత్తివేశారని తెలిపారు. 16 నెలల కాలంలో కాపులకు రూ.5,542 కోట్లు నేరుగా ఆర్థిక సాయం అందించిన ఘనత జగన్‌దేనన్నారు. కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రజా మేనిఫెస్టో అమలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. గుంటూరు జిల్లా నుంచి వచ్చిన కాపు మహిళలు శ్రీనివాసమ్మ, రమాదేవి, పి.లక్ష్మి మాట్లాడుతూ కాపులకు వరాల జల్లు కురిపించింది వైఎస్‌ జగన్‌ ఒక్కరేనన్నారు. కాపు కార్పొరేషన్‌ ఎండీ శ్రీనివాస శ్రీనరేష్‌ అధ్యక్షత వహించగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

టచ్ కూడ చెయ్యలేరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్

కాసుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు

జగన్ విజయం ఖాయమంటున్న సర్వేలు..

టీడీపీ గూండాల విధ్వంసం.. వీడియోలు వైరల్

అల్లు అర్జున్ భార్య స్నేహతో కలిసి రోడ్ సైడ్ దాబాలో భోజనం

బాబూ.. ప్ట్.. నాలుగు సీట్లేనా! విజయసాయిరెడ్డి సెటైర్లు

సందీప్ వంగాకు ఒకలా భన్సాలీకి మరోలా ఇదేనా బాలీవుడ్ నీతి

చంద్రబాబుపై పునూరు గౌతమ్ రెడ్డి సెటైర్లు

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

రేవంత్ ఓ జోకర్

Photos

+5

సాగని సంసారం.. రొమ్ము క్యాన్సర్‌తో పోరాటం.. తెలుగులో ఒకే ఒక్క మూవీ (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో ట్రిప్‌.. పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాటలు (ఫోటోలు)

+5

రేవ్‌ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)

+5

Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)

+5

Dinesh Karthik: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు)

+5

పండంటి బాబుకు జన్మనిచ్చిన బుల్లితెర జంట (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి (ఫొటోలు)

+5

వేలకోట్ల సామ్రాజ్యం.. చివరకు భార్య నగలు అమ్మాల్సి వచ్చింది: అనిల్ అంబానీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)

+5

Kalki 2898 AD Hyderabad Event: గ్రాండ్‌గా ప్రభాస్‌ కల్కి ఈవెంట్‌.. బుజ్జి లుక్‌ రివీల్‌ చేసిన మేకర్స్ (ఫొటోలు)

+5

హీరామండి సిరీస్‌లో అదరగొట్టిన అందాల ముద్దుగుమ్మలు (ఫోటోలు)