Breaking News

బద్వేల్‌ ఉప ఎన్నికపై సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు: సజ్జల

Published on Mon, 10/04/2021 - 13:57

సాక్షి, వైఎస్సార్‌,కడప: బద్వేల్‌ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థలో పవిత్రమైన కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన సంక్షేమం ప్రజల వద్దకు తీసుకెళ్లాలని, ప్రతి ఎన్నిక విశ్వసనీయతను తెలిపే విధంగా ఉండాలని సూచించారు. విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయమని స్పష్టం చేశారు. అందువల్లే తమ పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

చదవండి: 'గత ప్రభుత్వాలు బద్వేలు ప్రజలను పట్టించుకోలేదు'

నిబద్ధత, విశ్వసనీయతతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన కార్యక్రమాలే తమకు అధికారం అందించాయని సజ్జల పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, వ్యవస్థలో మార్పులు అభివృద్ధి వైపు నడిపిస్తున్నాయని, ప్రజలకు నేరుగా సంక్షేమం అందిస్తున్నామని వెల్లడించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు వచ్చేవిధంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అన్ని వర్గాలకు సమానంగా అన్ని విభాగాల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వైద్యరంగంలో సమూల మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. తీవ్ర ఆర్థికభారం, కోవిడ్‌ను కూడా అధిగమించి ప్రభుత్వం పనిచేసిన తీరు జాతీయస్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని తెలిపారు.

‘ప్రతిపక్షాలు ఇబ్బందులు పెడుతున్నా పట్టించుకోకుండా అభివృద్ధి చేస్తున్నాం. సమాజంలో ప్రతి ఒక్కరికి జరిగిన ప్రయోజనం తెలియజెప్పే అవకాశం మనకు బద్వేలు ఉపఎన్నికల రూపంలో వచ్చింది. ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు చేసిన కార్యక్రమం గురించి వివరించాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బద్వేలు నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారని నిరూపించాలి. పోటీలో ఎవరు వున్నా మన ప్రచారం, ఎన్నికల కార్యక్రమం సాగాలి. ఓటు ఎందుకు వేయాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎందుకు అండగా ఉండాలి అన్న విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి’  అని సూచించారు.

Videos

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

Photos

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)

+5

చిరుకు జోడీగా నయన్.. ఫస్ట్ టైమ్ ఇలా (ఫొటోలు)

+5

Miss World 2025 : రామోజీఫిల్మ్‌ సిటీలో అందాల కాంతలు..! (ఫొటోలు)

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)