Breaking News

రాళ్లపాడుకు జలసిరులు

Published on Sat, 07/23/2022 - 13:41

వర్షాధారిత ప్రాజెక్ట్‌గా మిగిలిన రాళ్లపాడుకు మహర్దశ పట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చర్యలతో జలసిరులు పొంగనున్నాయి. 1.1 టీఎంసీల సామర్థ్యం కలిగిన రాళ్లపాడు ప్రాజెక్ట్‌ నియోజకవర్గ రైతాంగానికి ప్రధాన సాగునీటి వనరు. ఈ ప్రాజెక్ట్‌ కింద ఉన్న భూములను సస్యశ్యామలం చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి ఇప్పటికే సోమశిల జలాలను కేటాయించగా, తాజాగా వెలిగొండ నుంచి కూడా నీటి వాటాను కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాళ్లపాడులో నిరంతరం జలకళ తాండవియనుంది.   

కందుకూరు(పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా):   రాళ్లపాడు ప్రాజెక్ట్‌.. రతనాల ప్రాజెక్ట్‌గా మారనుంది. కేవలం వర్షాధారితంగా నీటిని నింపుకునే ఈ ప్రాజెక్ట్‌కు ఇక నుంచి పుష్కలంగా నీటి వనరులు అందనున్నాయి. అటు పెన్నా, ఇటు కృష్ణా నది జలాలు తరలి రానున్నాయి. ఇప్పటికే సోమశిల ప్రాజెక్టు నుంచి ఉత్తర కాలువ ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టుకు పెన్నానది జలాలు వస్తుండగా, భవిష్యత్‌లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి కృష్ణా నది జలాలు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం జీఓ కూడా విడుదల చేసింది. మరో పక్క రాళ్లపాడు ప్రాజెక్ట్‌ ఆయకట్టు పరిధిని పెంచేందుకు ఎడమ కాలువ పొడిగింపునకు రూ.27 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. దీంతో రాళ్లపాడు ప్రాజెక్టు కింద సాగయ్యే పంటలకు, తాగునీటి అవసరాలకు పుష్కలంగా నీరు అందనుంది.   

నీటి వనరులతో సస్యశ్యామలం 
రాళ్లపాడు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.1 టీఎంసీలు. అధికారిక, అనధికారిక ఆయకట్టు కలుపుకుని మొత్తం 25 వేల ఎకరాలు సాగు అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్ట్‌ పరిధిలోని 130 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అటు పంటలకు, ఇటు తాగునీటి అవసరాలకు దాదాపు 2.2 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. తాజా నిర్ణయంతో సోమశిల జలాలు 1.5 టీఎంసీలు, వెలిగొండ జలాలు 1.17 టీఎంసీలు మొత్తం 2.67 టీఎంసీల నీరు అదనంగా ప్రాజెక్టులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్ట్‌ కింద 20.14 కి.మీ. పొడవు ఉండే కుడి కాలువ పరిధిలో లింగసముద్రం, గుడ్లూరు, కొండాపురం మండలాల్లో 14,500 ఎకరాల ఆయకట్టు ఉంది. 3 కి.మీ. పొడవు ఉండే ఎడమ కాలువ కింద లింగసముద్రం, వలేటివారిపాళెం మండలాల్లో 1,500 ఎకరాల ఆయకట్టు ఉంది. పూర్తిగా వర్షాధార ప్రాజెక్ట్‌ కావడంతో వర్షాలు పడి ప్రాజెక్ట్‌ నిండితేనే పంటలు పండుతాయి. గడిచిన దశాబ్దన్నర కాలంలో కేవలం రెండు, మూడు సార్లే పూర్తి స్థాయిలో పంటలు పండాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో సోమశిల ఉత్తర కాలువ ద్వారా 1.5 టీఎంసీల నీటిని రాళ్లపాడు ప్రాజెక్ట్‌కు కేటాయించారు. 

1.17 టీఎంసీల వెలిగొండ జలాలు  
వెలిగొండ ప్రాజెక్టు నుంచి 1.17 టీఎంసీల నీటిని కేటాయిస్తూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. నీటి కేటాయింపుతో పాటు కాలువ పనులకు రూ.6.14 కోట్లు కేటాయించారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి ఉదయగిరికి నీటిని తరలించే ఈస్ట్రన్‌ మెయిన్‌ కెనాల్‌ నుంచి రాళ్లపాడు ప్రాజెక్ట్‌లోకి నీటిని మళ్లించనున్నారు. ఇక్కడి నుంచి రాళ్లపాడు వరకు మొత్తం 57 కి.మీ. దూరం ఉంది. కేవలం 4 కి.మీ. కాలువ తవ్వడం ద్వారా ఉప్పువాగు నుంచి నక్కలగండి చెరువుకు మళ్లించి అక్కడి నుంచి మన్నేరు ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టులోకి నీటిని తరలించాలనేది ప్రతిపాదన. త్వరలో టెండర్ల కేటాయించి, పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.  

ఎడమ కాలువ పొడిగింపునకు  రూ.27 కోట్లు
రామాయపట్నం పోర్టు భూమి పూజకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాళ్లపాడు ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రాజెక్టు ఎడమ కాల్వ పొడిగింపు పనులు చేపట్టేందుకు రూ.27 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం 3 కి.మీ. పొడవు ఉన్న కాలువను 15.95 కి.మీ. మేర పొడిగించనున్నారు. తద్వారా కాలువ పరిధిలో ఉన్న ఆయకట్టు 1,500 ఎకరాల నుంచి 4 వేల ఎకరాలకు పెరుగుతోంది. చీమలపెంట, శాఖవరం, వీఆర్‌ కోట, కలవళ్ల, నలదలపూరు గ్రామాల చెరువులకు నీరు అందుతోంది. వర్షాధారితంగా చేరే నీటితో పాటు అదనంగా సోమశిల జలాలు 1.5 టీఎంసీలు, వెలిగొండ జలాలు 1.17 టీఎంసీలు మొత్తం 2.67 టీఎంసీలు రావడంతో ప్రాజెక్ట్‌ పరిధిలో ఆయకట్టు 40 వేల ఎకరాల వరకు పెరుగుతుందని అంచనా.    


ఎడమ కాలువ

Videos

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్

వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

మరోసారి వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత

త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్!

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)