Breaking News

మిరియం రైతుకు ప్రకృతి సెగ

Published on Mon, 02/09/2026 - 04:01

ఏజెన్సీలో గిరిజన రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మిరియం సాగు ఈ ఏడాది గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ప్రకృతి కన్నెర్ర చేయడంతో పూత దశలోనే పంట దెబ్బతిని, దిగుబడి భారీగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడాది రూ.లక్షల్లో ఆదాయం చూసిన రైతులు, ఈసారి కనీస పెట్టుబడులు కూడా వస్తాయో లేదోనని ఆందో ళన చెందుతున్నారు. 

సాక్షి, పాడేరు: ఏటా గిరిజన రైతులకు సిరులు కురిపించే మిరియం దిగుబడి ఈ ఏడాది ఆశాజనకంగా లేదు. తోటల్లోని పాదులకు అక్కడక్కడ మాత్రమే గుత్తులు కనిపిస్తుండటంతో, దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల మధ్య అంతరపంటగా మిరి యం సాగవుతోంది. గతంలో ఎకరానికి రూ. లక్ష వరకు ఆదాయం వచ్చేదని, ఈసారి మాత్రం రూ. 20 వేలకు మించి వచ్చేలా లేదని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. 

జాతీయ స్థాయిలో డిమాండ్‌ ఉన్నా.. 
గిరిజన రైతులు సాగు చేసే మిరియాలకు జాతీయ స్థాయిలో మంచి డిమాండ్‌ ఉంది. సాధారణంగా ఎకరాకు 150 నుంచి 200 కిలోల వరకు ఎండు మిరియాల దిగుబడి వస్తుంది. గత ఏడాది దిగుబడి బాగుండటంతో, కిలో మిరియాలు రూ.600 –రూ.700 వరకు పలికాయి. దీని తో ఎకరాకు సుమారు రూ. 1.5 లక్షల వరకు ఆదాయం లభించిందని రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది కాపు భారీగా తగ్గడంతో ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. 

పూత సమయంలో వర్షాల్లేక.. 
మిరియం పాదులు పూత దశలో ఉన్నప్పుడు వర్షాలు లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని గిరిజన రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా ఆగస్టు, సెపె్టంబర్‌ నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. దీని ప్రభావం పూతపై పడటంతో దిగుబడి క్షీణించింది. గత ఏడాది మిరియం గుత్తులతో కళకళలాడిన తోటలన్నీ ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.

తక్కువగా పూత 
ఐదు ఎకరాల కాఫీ తోటలో మిరియం పాదులు ఉన్నాయి.  ఏటా దిగుబడి ఎక్కువగా ఉండేది. ఈ ఏడాది పూత తక్కువగా ఉంది. అందువల్ల కాపు కూడా బాగా తగ్గింది. అరకు, పాడేరు మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. దీని ప్రభావం ఆదాయంపై చూపుతుంది.  – పాలికి లక్కు, గిరిజన ౖరైతు, మోదాపల్లి పంచాయతీ, పాడేరు మండలం 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)