Breaking News

ఎత్తిపోతల పథకం రాయలసీమకు జీవనాడి

Published on Sat, 02/21/2026 - 05:47

కడప కార్పొరేషన్‌: కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం జీవనాడి వంటి ప్రాజెక్టు అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సాకే శైలజానాథ్‌ అన్నారు. వైఎస్సార్‌ కడపలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని రైతులకు అతిపెద్ద కష్టం రాబోతోందన్నారు. సీఎం చంద్రబాబుకు సాగునీరంటే పట్టింపు లేదని, వ్యవసాయం అంటే దండగ అన్న భావనలో ఉన్నారన్నారు. స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడలేని ఉప ముఖ్యమంత్రి మనకు ఉన్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రజల కోసం, కృష్ణా పరివాహక ప్రాంత ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీ తీవ్ర పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కై ప్రాజెక్టును ఆపేయడం దారుణమన్నారు. బాబు స్వప్రయోజనాల కోసం సీమ ప్రజల గొంతు నులమడం అన్యాయమన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలని, తమ శక్తి సామర్థ్యాలేమిటో ప్రభుత్వానికి చూపాల్సిన సమయం వచ్చిందన్నారు. శ్రీశైలంలో 841 అడుగులకు నీరు చేరకముందే కోయల్‌సాగర్‌ నుంచి నీటిని వాడేస్తున్నారన్నారు. 

కరెంటు ఉత్పత్తి కోసం 8 టీఎంసీలు బయటికి పోతోందన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందనే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మాణాన్ని ఆపేశారన్నారు. అల్మట్టి సామర్థ్యాన్ని 150 టీఎంసీలకు పెంచి అప్పర్‌ భద్రకు సాగునీటిని ఇస్తే శ్రీశైలానికి నీరు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. అనంతపురం, కృష్ణా డెల్టాలు దీని వల్ల దెబ్బతింటాయన్నారు. ఈ ప్రభుత్వానికి అమరావతి తప్ప మరేదీ పట్టడం లేదన్నారు. ప్రశ్నించే గొంతులు లేకుండా చంద్రబాబు భయానక పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. 

రాయలసీమ లిఫ్ట్‌ వల్ల వచ్చే 22 టీఎంసీలతో ఏం లాభమని ఇరిగేషన్‌ మంత్రి మాట్లాడడం దారుణమన్నారు. హంద్రీ–నీవా నుంచి గాలేరు–నగరికి ఉన్న లింక్‌ కెనాల్‌ కూడా పూర్తి చేయడం లేదని, అనంతపురానికి మంజూరైన ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించారని, గ్రామీణ బ్యాంకు హెడ్‌ ఆఫీసును సైతం అమరావతికి తీసుకెళ్లారన్నారు. ఉక్కు పరిశ్రమ ఊసే లేదని, కర్నూలు హైకోర్టు గూర్చి మాట్లాడేవారే లేరన్నారు. 

తమ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసే రాయలసీమ వ్యతిరేక నిర్ణయాలను సహించబోమని, కలిసి వచ్చే పార్టీలతో పోరాటం చేస్తామని శైలజానాథ్‌ హెచ్చరించారు. అందులో భాగంగానే మార్చి 1వ తేదీన  కడపలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.   

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)