Breaking News

తీగ తెగితే.. కరెంటు ఆగాలి

Published on Wed, 08/24/2022 - 03:55

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా విద్యుత్‌ ప్రమాదాల్లో ఎక్కువ శాతం విద్యుత్‌ వైర్లను తాకడం వల్లనే జరుగుతున్నాయని, వీటి నుంచి ప్రజలను రక్షించేందుకు విదేశాల్లో అమల్లో ఉన్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయాలని ఎలక్ట్రికల్‌ సేఫ్టీ స్టాండింగ్‌ కమిటీ సూచించింది. వైరు తెగిపోగానే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయేలా చేసే ఫీడర్‌ ప్రొటెక్షన్‌ రిలే విధానంపై అధ్యయనం చేయాలని చెప్పింది. విద్యుత్‌ భద్రతపై జాతీయస్థాయిలో మూడేళ్ల తరువాత 6వ స్టాండింగ్‌ కమిటీ సమావేశం మంగళవారం విజయవాడలో జరిగింది.

విద్యుత్‌ భద్రత, సరఫరాకు ఈ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిబంధనలు–2010లో సవరణలు చేయాలని కమిటీ సూచించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి చర్యలు చేపట్టాలని పేర్కొంది. కమిటీ చైర్మన్‌ గౌతమ్‌ రాయ్‌ మాట్లాడుతూ విద్యుత్‌ ప్రమాదాల నివారణకు రాష్ట్రాలు సూచన లివ్వాలని కోరారు. వాటిని పరిగణనలోకి తీసుకుని నిబంధనల్ని సవరిం చేందుకు సీఈఏకి నివేదిక పంపుతామని తెలిపారు. కమిటీ మెంబర్‌ సెక్రటరీ రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ 2017లో ఈ కమిటీ ఏర్పడి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం చేస్తోందని చెప్పారు.

ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ భద్రతపై అవగాహన నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అని చెప్పారు. చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్, ఎలక్ట్రికల్‌ సేఫ్టీ డైరెక్టర్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ కండక్టర్ల స్నాపింగ్, లైవ్‌వైర్లతో జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నందున వాటిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంద న్నారు. సీఈఏ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ముకుల్‌కుమార్‌ నేతృత్వంలో రాష్ట్ర ఎలక్ట్రికల్‌ సేఫ్టీ విభాగం ఆ«ధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముంబై (వెస్ట్‌), చెన్నై (సౌత్‌), ఢిల్లీ (నార్త్‌), కోల్‌కతా (ఈస్త్‌), మేఘాలయ (నార్త్‌ఈస్ట్‌) ప్రాంతీయ ఇన్‌స్పెక్టరేట్‌ల డైరెక్టర్లు, వివిధ రాష్ట్రాల ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌ల సిబ్బంది పాల్గొన్నారు.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)