నెరవేరనున్న 37 ఏళ్ల కల

Published on Sat, 08/25/2018 - 14:50

పరకాల : 37 సంవత్సరాల క్రితం పరకాల నుంచి తరలించుకుపోయిన రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాన్ని తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో ఈ నెల 27న ప్రారంభించుకోబోతున్నట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలి పారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వపరిపాలనే లక్ష్యంగా 10 జిల్లాల తెలం గాణ రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా, కొత్త రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలు, మండలాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గతంలో పరకాల రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాన్ని ములుగుకు తరలించడంలో టీడీపీ, బీజేపీ నేతల హస్తం ఉండగా ప్రస్తుత జయశంకర్‌ జిల్లాలోని భూపాలపల్లి, చిట్యాల, రేగొండ, మొగుళ్లపల్లి మండలాలతో ఉన్న పరకాల నియోజకవర్గాన్ని కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ముక్కలు చేసి పరకాల ప్రజలకు అన్యాయం చేశారన్నారు.

పరకాలలోని అన్నివర్గాల ప్రజల పోరాటాలతో 2017 అక్టోబర్‌ 27న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణం శంకుస్థాపన సభలో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాన్ని ప్రకటించి 2018 ఏప్రిల్‌ మొదటి వారంలో గెజిట్‌ విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నెల 27న సోమవారం ఆర్డీఓ కార్యాలయ ప్రారంభంతో పరకాల రెవెన్యూ డివిజన్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ఉప ముఖ్యమంత్రి కడి యం శ్రీహరి, మంత్రి హరీష్‌రావు, స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, వరంగల్‌ ఎంపీ దయాకర్, జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దల పద్మ,  కార్పొరేషన్‌ చైర్మన్లు లింగంపల్లి కిషన్‌రావు, రాజయ్యయాదవ్, నాగుర్ల వెంకటేశ్వర్‌రావు, వాసుదేవరెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. డివిజన్‌ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నడికూడ తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఉదయం 10 గంటలకు ప్రారంభించిన తర్వాత 10.30 గంటలకు పరకాల రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ కొంపెల్లి ధర్మారాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బొచ్చు వినయ్, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ పావుశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు దుబాసి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Videos

పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన

ఏపీ పరువు తీశారు టీడీపీ వాళ్ళు..కృష్ణంరాజు సంచలన కామెంట్స్

కాంగ్రెస్‌ లీడర్లు నన్నేదో చేయాలనుకుంటున్నారు: మల్లారెడ్డి ఫైర్‌

హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి..

లోకేష్ కి ఆ వీడియో ఎక్కడిది

ఈసీకి సజ్జల 10 ప్రశ్నలు

దమ్ముంటే ఆ ప్రాంతంలో రీపోలింగ్ పెట్టాలి

చిన్నమ్మ స్వార్ధానికి మునిగిపోతున్న బీజేపీ..

ఏడు చోట్ల EVM ధ్వంసలు జరిగాయి..కృష్ణం రాజు రియాక్షన్

మాలీవుడ్‌లో 1000 కోట్ల క్లబ్ సినిమాలు

Photos

+5

రేవ్‌ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)

+5

Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)

+5

Dinesh Karthik: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు)

+5

పండంటి బాబుకు జన్మనిచ్చిన బుల్లితెర జంట (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి (ఫొటోలు)

+5

వేలకోట్ల సామ్రాజ్యం.. చివరకు భార్య నగలు అమ్మాల్సి వచ్చింది: అనిల్ అంబానీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)

+5

Kalki 2898 AD Hyderabad Event: గ్రాండ్‌గా ప్రభాస్‌ కల్కి ఈవెంట్‌.. బుజ్జి లుక్‌ రివీల్‌ చేసిన మేకర్స్ (ఫొటోలు)

+5

హీరామండి సిరీస్‌లో అదరగొట్టిన అందాల ముద్దుగుమ్మలు (ఫోటోలు)

+5

కావ్యా మారన్‌తో ఫొటోలకు ఫోజులు.. ఈ బ్యూటీ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (ఫొటోలు)