Breaking News

వినాశకర విధానాలతో ముందుకు వెళుతోంది

Published on Sun, 03/19/2017 - 20:09

హైదరాబాద్‌: పరిపాలన మీద ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సూచించారు. మహాజన పాదయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకోవాలని.. లేదంటే సీపీఎం తయారుచేసిన ప్రజా సమస్యల ప్రణాళికలను పాటించండని సూచించారు. సమాజంలో అనేక మార్పులు రావాల్సిన పరిస్థితి ఉందన్నారు. అట్టడుగు వర్గాలు 93 శాతం ఉన్న తెలంగాణలో అభివృద్ధి ఫలాలు వారికే ముందు అందాల్సి ఉందని గుర్తు చేశారు.

వీర తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తిని మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన సందర్బం వచ్చిందన్నారు. విభజన జరిగిన తరువాత కూడా తెలంగాణలో విధానాలు మారలేదని అన్నారు. ప్రజా ఆగ్రహానికి కేసీఆర్‌ నవ్వుతున్నారని.. ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూసే రోజు దగ్గర్లోనే ఉన్నదని హెచ్చరించారు. నోట్ల రద్దు వ్యవహారం ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని.. వంద మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వినాశకర విధానాలతో ముందుకు వెళుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం సృష్టించిన ఒక వైపరిత్యమని చెప్పారు. గుజరాత్ లోని అత్యధికంగా దొంగనోట్లు బయటపడ్డాయని పేర్కొన్నారు. బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ ప్రారంభించిన ఈ పాదయాత్ర క్షేత్ర స్థాయిలో పనిచేసిందన్నారు. ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులే పాదయాత్ర విజయవంతం అవడానికి కృషి చేశాయన్నారు.
 
 

Videos

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో బిగ్ అప్‌డేట్

జోహార్ చంద్రబాబు.. జోహార్ లోకేష్.. గంటా కొడుకు అత్యుత్సాహం

బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం

పసి మనసులను చంపేస్తోన్న వివాహేతర సంబంధాలు

ఎల్లో మీడియా వేషాలు

Photos

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)