amp pages | Sakshi

చంద్రబాబు అవినీతి వల్లే..

Published on Fri, 07/20/2018 - 10:19

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ విమర్శించారు. అసలు పూటకో మాట మాట్లాడే చంద్రబాబు రాజకీయాలకు పనికిరారని మండిపడ్డారు. ప్రస్తుతం కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధాన కారణం ప్రజల్లో విశ్వాసం కోల్పోవడమేనని వరప్రసాద్‌ ఎద్దేవా చేశారు. ప్రధానంగా చంద్రబాబు అవినీతి, అసమర్థత వల్ల ఏపీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఏపీకి బీజేపీ-టీడీపీ రెండూ ద్రోహం చేశాయన్న వరప్రసాద్‌.. చంద్రబాబు ద్రోహి నంబర్‌వన్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

ప్రత్యేక హోదా కోసం మొదట ఆమరణ దీక్ష చేసింది మాత్రం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనే విషయాన్ని ఈ సందర్భంగా వరప్రసాద్‌ గుర్తు చేశారు. ప్రత్యేకహోదా అనేది నేటికీ సజీవంగా ఉందంటే అందుకు కారణం జగనేనన్నారు. ఏపీకి హోదా కోసం ఏమేమి చేయాలో అన్నింటినీ వైఎస్సార్‌సీపీ చేసిందన‍్నారు. తాము కేంద్రంపై 13సార్లు అవిశ్వాసాన్ని పెట్టినా చర్చకు అనుమతి ఇవ్వలేదన్నారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు సృష్టించిన గందరగోళం కారణంగానే తాము పెట్టిన అవిశ్వాసంపై చర్చకు రాలేదన్నారు. ఇదే విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌ కూడా సభ సాక్షిగా చెప్పిన విషయాన్ని వరప్రసాద్‌ పేర్కొన్నారు. ఇకనైనా అవకాశ వాద రాజకీయాలను టీడీపీ వదిలిపెట్టాలని హితవు పలికారు. ఇప్పటికైనా బీజేపీ..  ఏపీకి హోదాను ప్రకటిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

మరోనేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ..‘ మేము అవిశ్వాసం పెట్టినప్పుడు అవహేళన చేశారు. ఇప్పడు మధ్యలో వచ్చి నేనే చాంపియన్‌ అని చంద్రబాబు అంటున్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి.. ప్యాకేజీకి ఒప్పుకుంది చంద్రబాబు. ఎవరు ఎలా చేస్తున్నారో ఏపీ ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు ఆలోచనంతా జగన్‌ను ఇబ్బంది పెట్టడంపైనే. చంద్రబాబు-మోదీ రాష్ట్రానికి చాలా ద్రోహం చేశారు’ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత కథనాలు:

నేడే అవిశ్వాసం

టీడీపీ అవిశ్వాస తీర్మానం వెనుక కేంద్ర సర్కార్‌ కనుసైగ!


 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)