4 వేల కి.మీ.; మరో వారసుడి ప్రజాయాత్ర!

Published on Thu, 07/18/2019 - 17:13

ముంబై : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శివసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్న మరాఠా పార్టీ ఈ దఫా ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివసేన చీఫ్‌ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, పార్టీ యూత్‌వింగ్‌ నాయకుడు ఆదిత్య ఠాక్రేను సీఎం అభ్యర్థిగా బరిలో దింపాలని యోచిస్తోంది. ఆదిత్యను భవిష్యత్‌ నాయకుడిగా తీర్చిదిద్దేందుకు ఎన్నికల వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరొందిన ప్రశాంత్‌ కిషోర్‌తో శివసేన ఒప్పందం కుదర్చుకున్నట్లుగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఉద్ధవ్‌ ఠాక్రే వారసుడు ఆదిత్య ఠాక్రే గురువారం ప్రజాయాత్ర చేపట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గడపగడపకూ శివసేన విధానాలను చేర్చాలనే ఉద్దేశంతో జన ఆశీర్వాద యాత్ర పేరిట ఆదిత్య ఠాక్రే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. పార్టీ సీనియర్‌ నేతలు ఏక్‌నాథ్‌ షిండే, రామ్‌దాస్‌ కదమ్‌లతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పార్టీ శ్రేణులు వెంటరాగా ప్రత్యేక వాహనం(కారు)లో ఆదిత్య ఠాక్రే బయల్దేరారు. జలగాన్‌ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక పర్యటనకు సంబంధించిన విశేషాలను ఆదిత్య ఠాక్రే ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

చదవండి : మహారాష్ట్ర సీఎంగా ఆదిత్య ఠాక్రే!?

జన ఆశీర్వాద యాత్ర గురించి ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ...‘ మహారాష్ట్రలోని ప్రతీ ఇంటికి శివసేనను చేర్చాలనే  సంకల్పంతో నేడు ఈ యాత్ర ప్రారంభించాను. సరికొత్త మహారాష్ట్ర నిర్మాణం మాతోనే సాధ్యం. శివసేన యువకులు, రైతులు, మహిళల పక్షపాతి. ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుంది. వారి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఓట్లను అడిగేందుకు నేను ఈ యాత్ర చేపట్టలేదు. నా దృష్టిలో ఇది ఒక పవిత్ర తీర్థ యాత్ర. సమస్యలను ఎలా పరిష్కరించాలో నా తండ్రి, తాతయ్య నుంచి నేర్చుకున్నాను. నేటి నుంచి దానిని క్షేత్ర స్థాయిలో అమలు చేస్తాను’ అంటూ భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు.

చదవండి : అమిత్‌ షా హామీ ఇచ్చారు..నెక్ట్స్ సీఎం!

తనేం చేస్తున్నాడో తనకు తెలుసు..
జన ఆశీర్వాద యాత్ర గురించి శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ..‘ తను చేపట్టిన ఈ యాత్రపై ఆదిత్య ఠాక్రేకు పూర్తి అవగాహన, స్పష్టత ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో శివసేనకు ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలియజేసేందుకు, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయమని ఆదిత్య ప్రజలకు విఙ్ఞప్తి చేస్తారు. శివసేన విధానాల గురించి సభల్లో ప్రసంగిస్తారు. ఆదిత్య ఠాక్రే నాయకత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నా’  అని వ్యాఖ్యానించారు. కాగా కాబోయే మహారాష్ట్ర సీఎం ఆదిత్య ఠాక్రే అంటూ సంజయ్‌ రౌత్‌ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా పార్టీలోని సీనియర్‌ నాయకులు సహా పలువురు యువ నాయకులు కూడా ఉద్ధవ్‌ ఠాక్రే స్థానాన్ని భర్తీ చేసి ముఖ్యమంత్రి కాగల సత్తా ఆదిత్యకు మాత్రమే ఉందని అభిప్రాయపడుతున్నారు. అన్నీ సజావుగా జరిగితే 29 ఏళ్ల ఈ యువ నాయకుడే సీఎం అవుతాడంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ వారసుడిగా రంగంలోకి దిగిన ఉదయనిధి స్టాలిన్‌ కూడా ప్రజాయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

చదవండి : ప్రశాంత్‌ కిషోర్‌ చేతిలో ఠాక్రే వారసుడు

Videos

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు..బాబుది బోగస్ రిపోర్టు

కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు

బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..

పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి

నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు

జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి

ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)