More

'అందరూ రాజ్యాంగంపైనే ప్రమాణం చేయాలి'

30 Nov, 2015 14:32 IST

ముంబై: మత పరమైన గ్రంధాల మీద కాకుండా అందరూ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని శివసేన కోరింది. దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి మతపరమైన అడ్డంకులను తొలగించినట్లు అవుతుందని శివసేన అధికార పత్రిక సామ్నాలో సోమవారం పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానులే కానీ రాజ్యాంగం అనేది అన్నింటి కంటే అత్యుత్తమమైనదని వ్యాఖ్యానించింది.

అన్నిమతాల వారికి భారత రాజ్యాంగమే పవిత్ర గ్రంథం కావాలని శివసేన అభిప్రాయపడింది. భారత రాజ్యాంగం ముందు అన్ని మతాల వారు సమానమేనని గతంలో బాల్ థాక్రే వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన శివసేన.. కోర్టుల్లో ప్రజలంతా మత గ్రంథాల పైన కాకుండా రాజ్యాంగంపైనే ప్రమాణం చేసేలా చర్యలు తీసుకోవాలని కొరింది. ఇటీవల పార్లమెంట్లో మోదీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా పేర్కొంటూ దాన్ని మార్చడం అంటే ఆత్మహత్యకు పాల్పడటంతో సమానం అని ప్రకటించిన నేపథ్యంలో శివసేన ఈ కామెంట్స్ చేసింది.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Rajasthan: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ఇది అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌: నడ్డా

సహారా కేసులో ఇన్వెస్టర్లకు ఊరట: సెబీ చీఫ్‌ క్లారిటీ

సుబ్రతారాయ్‌ అంత్యక్రియలు: ఎవరు చేస్తున్నారో తెలుసా?

రాజస్థాన్‌ ఎన్నికలపై పాక్‌ కన్ను.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

సుప్రీంకోర్టు మొట్టికాయ.. మరోసారి తమిళనాడు గవర్నర్‌ వివాదాస్పద నిర్ణయం