More

ట్యూన్‌ కుదిరిందా?

19 May, 2019 01:06 IST

ఇన్ని రోజులు కథపై వర్క్‌ చేసిన దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్, ఇప్పుడు సంగీతదర్శకుడు గోపీ సుందర్‌తో కలిసి మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఇదంతా ఆయన నెక్ట్స్‌ చిత్రం గురించే. అఖిల్‌ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్‌ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ట్యూన్స్‌ను ఫైనలైజ్‌ చేసే పనిలో ఉన్నారు టీమ్‌. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌ సెకండ్‌ వీక్‌లో స్టార్ట్‌ కానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా కియారా అద్వానీ, రష్మికా మండన్నాపేర్లు తెరపైకి వచ్చాయి. హీరోయిన్‌ ఎవరు? అనే విషయంపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

స్టేజీపై ఇద్దరు హీరోల ముద్దులాట, వీడియో చూశారా?

బిగ్‌ బాస్‌: బాత్రూంలో లేడీ కంటెస్టెట్స్‌ రచ్చ.. పురుషులు నచ్చరంటూ..

డాక్టర్‌గా మారిన హీరోయిన్‌... సినిమాలకు గుడ్‌బై?

చిన్న సినిమాలను చులకన చేసిన విశాల్‌.. దర్శకుడి కౌంటర్‌..

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో 75 అవార్డులు గెల్చుకున్న షార్ట్‌ ఫిలిం, స్ట్రీమింగ్‌ అక్కడే!