Breaking News

కొత్త రాజధానికి ‘ద్వీప’కాంతులు

Published on Wed, 10/07/2015 - 04:27

♦ గోల్ఫ్ కోర్టు, రిసార్టులు..
♦ ద్వీపానికి వెళ్లేందుకు మూడు బ్రిడ్జిలు.. రోడ్డుకు ఇరువైపులా ఐకానిక్ టవర్లు
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన భవానీ ద్వీపం సమీపంలో ఉన్న మరో ద్వీపాన్ని అభివృద్ధి చేసి దాన్ని రాజధాని నగరానికి అనుసంధానం చేయనున్నారు. సింగపూర్ ప్రభుత్వ కంపెనీలిచ్చిన మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగానే ఈ ద్వీపం ఆధారంగా కొత్తగా రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించేందుకు సీఆర్‌డీఏ వ్యూహరచన చేసింది. ఈ నెల 22న రాజధానికి శంకుస్థాపన చేసే ప్రాంగణం కూడా ఈ ద్వీపానికి అనుసంధానమైన రోడ్డుకు పక్కనే ఉండేలా ఏర్పాటు చేశారు. శంకుస్థాపన చేసే ఉద్ధండ్రాయునిపాలెం గ్రామానికి ఎదురుగా కృష్ణానదిలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఒక చిన్న ద్వీపం ఉంది. భవానీ ద్వీపానికి ఇది రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.

నదిలో పలుచోట్ల ఉన్న చిన్న, చిన్న ద్వీపాల్లోని మట్టిని తెచ్చి దీన్ని ఇంకా పటిష్టం చేసి దీర్ఘచతురస్రాకారంలోకి మార్చుతారు. అలా ఈ ద్వీపాన్ని తయారు చేసి అందులోని 10-12 ఎకరాల విస్తీర్ణంలో గోల్ఫ్ కోర్టు, ఫుడ్‌కోర్టులు, రిసార్టులు, హోటళ్లు నెలకొల్పాలని సంకల్పించారు. విజయవాడ వైపు నుంచి ఈ ద్వీపంలోకి వెళ్లేందుకు బోటు మార్గం, రాజధాని నుంచి  బ్రిడ్జిల మీదుగా రోడ్డు మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ద్వీపం చుట్టూ ఆకర్షణీయమైన రిటెయినింగ్ వాల్‌ను నిర్మిస్తారు.

 ద్వీపం నుంచి బ్రిడ్జ్ కమ్ రోడ్డు
 ఈ ద్వీపం నుంచి రాజధాని వైపు కరకట్ట వరకూ మూడు బ్రిడ్జిలు నిర్మించేందుకు రూపకల్పన చేశారు. ద్వీపం మధ్య భాగం నుంచి ఉద్ధండ్రాయునిపాలెం వరకూ బ్రిడ్జి, అక్కడి నుంచి రాజధాని డౌన్‌టౌన్ వరకూ రహదారిని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ బ్రిడ్జి కమ్ రోడ్డు నాలుగు వరుసలుగా ఉంటుంది. ఈ బ్రిడ్జి రాజధానిలో ప్రవేశించే చోటే ప్రస్తుతం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో శంకుస్థాపన ప్రాంతాన్ని ఈ రోడ్డుకు జంక్షన్‌గా మార్చి దాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.

ఈ జంక్షన్‌కు కొంచెం అవతల రోడ్డుకిరువైపులా 25 నుంచి 40 అంతస్తుల ఐకానిక్ టవర్లు నిర్మించాలని మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. ద్వీపం మధ్యభాగం నుంచి నిర్మించే బ్రిడ్జితోపాటు దానికి రెండువైపులా మరో రెండు బ్రిడ్జిలను కరకట్ట వరకూ నిర్మిస్తారు. అంటే ద్వీపం నుంచి రాజధాని ప్రాంతానికి మూడు బ్రిడ్జిలుంటాయి. సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జిలను నిర్మించే అవకాశం ఉంది.

Videos

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

Photos

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)