తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
మంట కలిసిన మానవత్వం
Published on Fri, 09/16/2016 - 00:01
- కాలువలో మృత శిశువు లభ్యం
- సారంగాపూర్ మండలంలో భ్రూణ హత్య..!
సారంగాపూర్ : మానవత్వం మంట కలిసింది. కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల అని తెలిసి నెలలు నిండకుండానే అబార్షన్ చేయించుకుని కాలువలో పడేసింది ఓ మనసు లేని తల్లి. మండలంలోని ఆలూరు గ్రామంలో గురువారం ఉదయం బోయివాడ ఇళ్లమధ్యలో ఉన్న పంటకాలువలో నెలలు నిండని శిశువు మృతదేహం లభ్యమైంది. గురువారం ఉదయం బోయివాడలో స్థానికులు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో కాలువలో నెలలు నిండని పసికందు మృతదేహాన్ని గుర్తించారు.
నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చి ఉంటుందని గమనించిన వెంటనే స్థానిక సర్పంచ్ చింతకుంట రాజమణికి సమాచారం అందించారు. పసికందు మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సారంగాపూర్ ఎసై ్స శ్రీనివాస్, పీఎస్ఐ ఎం.డీ. ఆసీఫ్లు అక్కడకు చేరుకుని పంచనామా నిర్వహించారు.
అలాగే ఏఎన్ఎం, ఆశాకార్యకర్తల సహకారంతో గ్రామంలో గర్భిణుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వీఆర్వో సబిత, కారోబార్ మురళిలు మృతదేహాన్ని పరిశీలించారు. స్కానింగ్లో ఆడపిల్ల అని తెలుసుకుని అబార్షన్ చేయించుకుని పారేశారా....? లేదా వివాహేతర సంబంధం అని తప్పుచేశారా అనే కోణంలోఎవరీ తప్పు చేశారు అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
#
Tags