అన్నయ్య వరసయ్యే వ్యక్తి భార్యతో..

Published on Wed, 09/05/2018 - 12:25

చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామ శివారులోని కృపా గ్రానైట్స్‌ వద్ద ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. సమీప బంధువు భార్యతో ఆ యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్న నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. క్వారీలో విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై చిలకలూరిపేట వస్తున్న యువకుడిని ఆగంతకులు దారికాచి మారణాయుధాలతో దాడిచేసి హతమార్చారు.

గుంటూరు, చిలకలూరిపేటరూరల్‌: క్వారీలో విధులు నిర్వర్తించి తిరిగి వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన మంగళవారం తెల్లవారు జామున మండలంలో జరిగింది. రూరల్‌ పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా, సంతమాగులూరు మండలం, గురిజేపల్లి గ్రామానికి చెందిన నూతలపాటి అంజనీరాజు(25) చిలకలూరిపేట పట్టణంలో నివసిస్తున్నాడు. యడవల్లిలోని గ్రానైట్‌ క్వారీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగానే మంగళవారం తెల్లవారు జామున విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై కోటప్పకొండ – చిలకలూరిపేట ఆర్‌ అండ్‌ బీ రహదారిపై నుంచి చిలకలూరిపేట పట్టణం వైపు వస్తున్నాడు. యడవల్లి గ్రామ శివారులోని కృపా గ్రానైట్స్‌ వద్ద పెద్ద బండరాయి వద్ద కాపు కాచిన గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి మారణాయుధాలతో దాడి చేయడంతో అంజనీరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి రెండేళ్ల కిందటే వివాహమైంది. సమాచారం తెలుసుకున్న సర్కిల్‌ సీఐ యు.శోభన్‌బాబు, రూరల్‌ ఎస్‌ఐ పి.ఉదయ్‌బాబు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద పంచనామా నిర్వహించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడి సోదరుడు నూతలపాటి హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అన్నయ్య వరసయ్యే వ్యక్తే హతమార్చాడు!?
మృతుడు అంజనీరాజుకు గురిజేపల్లి గ్రామానికి చెందిన అన్నయ్య వరసయ్యే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏడాది కిందట అన్నా వదినలను విడదీసిన మృతుడు, చిలకలూరిపేట పట్టణంలో మరో గృహంలో వదినతో  నివాసం ఉంటూ సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై అనేక విడతలు సంఘ పెద్దలు, గ్రామస్తుల వద్ద పంచాయితీలు పెట్టారని సమాచారం. దీంతో తమ్ముడిపై కక్ష పెంచుకున్న అన్న మరో ఇద్దరితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది.

ఫిర్యాదులో అనుమానితులుగానిందితుల పేర్లు!
మృతుడి తమ్ముడు ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించే నూతలపాటి హరికృష్ణ పోలీసులకు అందించిన ఫిర్యాదులో సైతం అన్నయ్య వరుసయ్యే వ్యక్తితో  పాటు మరో ఇద్దరి వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రూరల్‌ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై సీఐను ప్రశ్నించగా, కేసును విచారిస్తున్నామని, వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

Videos

52 మందితో మోడీ క్యాబినెట్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి

ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు

ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్

ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...

కేంద్రం నుండి రామ్మోహన్ రాయుడు, పెమ్మసాని ఫోన్ కాల్

డ్రాగన్ కంట్రీ కుట్రలో మాల్దీవులు..!?

పుష్ప2 Vs వేదా మూవీ బిగ్ క్లాష్..

మకాం మారుస్తున్న శ్రీలీల..

Photos

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)