ఇప్పుడు బజాజ్‌ ఆటో వంతు

Published on Thu, 12/22/2016 - 01:13

జనవరి నుంచి రూ.1,500 వరకు వాహన ధరల పెంపు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘బజాజ్‌ ఆటో’ తాజాగా వాహన ధరలను రూ.700 నుంచి రూ.1,500 శ్రేణిలో పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా నిర్ణయం జనవరి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ధరలపెంపునకు ఉత్పత్తి వ్యయం పెరుగుదల కారణమని వివరించింది. ‘దేశంలోని టూవీలర్‌ కంపెనీలన్నీ వాటి వాహనాలను బీఎస్‌–4 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నాయి. ఇందుకోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌నెలను టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఇతర కంపెనీల కన్నా ముందే మేమే ఈ మార్క్‌ను చేరుకోవాలని భావిస్తున్నాం’ అని బజాజ్‌ ఆటో ప్రెసిడెంట్‌ (మోటార్‌ సైకిల్‌ విభాగం) ఎరిక్‌ వాస్‌ తెలిపారు.

కొన్ని మోడళ్లను ఇప్పటికే బీఎస్‌–4 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించామని, మిగిలిన వాటిని కూడా వచ్చే నెలలో బీఎస్‌–4 ప్రమాణాలకు అనువుగా అప్‌గ్రేడ్‌ చేస్తామని వివరించారు. ఈ అంశం కూడా వాహన ధరలపెంపుపై ప్రభావం చూపిందన్నారు. ప్రస్తుతం భారత్‌లో టూవీలర్‌ వాహనాలు బీఎస్‌–3 ప్రమాణాలకు అనుగుణంగా నడుస్తున్నాయి. కాగా హ్యుందాయ్, నిస్సాన్, రెనో, టయోటా, టాటా మోటార్స్, మెర్సిడెస్‌ బెంజ్‌ వంటికంపెనీలు కూడా వాహన ధరలను జనవరి నుంచి పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.

Videos

కీలక చర్చలు .. వైఎస్ జగన్ ను కలిసిన YSRCP నేతలు

EVM ట్యాంపరింగ్ పై చంద్రబాబు కామెంట్స్....

టీడీపీ నేతల దాడులపై కాటసాని రామిరెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్

చంద్రబాబు మంత్రివర్గం రేసులో బీజేపీ నేతలు

కాంగ్రెస్ ఓట్లు కూడా మాకే

అగ్నికుల్ కాస్మోస్ అనే స్మార్టప్ కంపెనీ సాధించిన విజయం

నీట్ గందరగోళం టెన్షన్ లో విద్యార్థులు

జనసేనకు 4 మంత్రి పదవులు..

జనసేనకు 4 మంత్రి పదవులు..

ఈ గ్రామంలో పెన్షన్లు లేపేస్తున్న.. టీడీపీ బెదిరింపులు

Photos

+5

బర్త్‌డే స్పెషల్.. 'సుందర్ పిచాయ్' సక్సెస్ జర్నీ & లవ్ స్టోరీ (ఫొటోలు)

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)