More

పొట్టి శ్రీరాములుకు భారతరత్న ఇవ్వాలి

1 Nov, 2014 11:05 IST
పొట్టి శ్రీరాములుకు భారతరత్న ఇవ్వాలి

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 వ తేదీనే నిర్ణయించాలని సీఎం చంద్రబాబును నెల్లూరు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్రెడ్డి డిమాండ్ చేశారు. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలని చంద్రబాబు నిర్ణయాన్ని మేకపాటి ఈ సందర్బంగా ఖండించారు. అవతరణ దినోత్సవం విషయంలో మరోసారి ఆలోచించాలని మేకపాటి ఈ సందర్భంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

శనివారం నెల్లూరు నగరంలోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి మేకపాటి రాజమోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, జడ్పీ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షడు ఎన్. ప్రసన్న కుమార్ రెడ్డి  పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములుకు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అమల్లోకి ఏపీ భూ హక్కుల చట్టం

నేటి నుంచి సామాజిక సాధికార యాత్ర రెండో దశ 

‘ఆహార’ ఉత్పత్తులకు ­ఊతం

పైకి పొత్తులు.. లోపల కత్తులు

ఇక కల్తీనీ ఇట్టే పసిగట్టొచ్చు