అందరూ నీలాగే మాట తప్పుతారని భావిస్తే ఎలా?

Published on Sat, 05/30/2020 - 10:16

సాక్షి, తాడేపల్లి: సీఎం వైఎస్‌ జగన్‌ పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ కేంద్ర పార్టీకార్యాలయం వద్ద ఘనంగా వేడుకలను నిర్వహించారు. సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కావడంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి, దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర గతిని మార్చి నేటికి ఏడాదయ్యింది. రాష్ట్ర స్వరూపాన్ని సీఎం జగన్‌ మార్చేశారు. భావితరాలు మెచ్చే విధంగా ఏడాది పాలన సాగింది. మేనిఫెస్టోలో పెట్టిన 90శాతం హామీలను అమలు చేశారు. ప్రజలు జగన్‌మోహన్‌ రెడ్డి మీద నమ్మకాన్ని నిలబెట్టారు. చదవండి: రైతు ముంగిటకే సమస్త సేవలు

సీఎం జగన్‌ విజన్‌ ఉన్న నేత. సంక్షేమం అనేది వైఎస్సార్‌‌ కుటుంబానికే సాధ్యం. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా జగన్‌ తన ఏడాది పాలనలో ప్రజలకు అందించారు. చంద్రబాబులా ఇచ్చిన మాట తప్పడం జగన్‌కు అలవాటు లేదు. చంద్రబాబు గురించి ప్రజలు మర్చిపోయారు. సీఎంపై విమర్శలు చేసేందుకే మహానాడు పెట్టారు. ప్రజలకు పనికొచ్చే ఒక్క తీర్మానం చేయకుండానే మహానాడును ముగించారు. జగన్‌మోహన్‌ రెడ్డి హామీలు అమలు చేయలేరని టీడీపీ నేతలు విమర్శలు చేశారు. కానీ పదవి చేపట్టిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను దాదాపుగా అమలు చేసి చూపించారు. చంద్రబాబు తనలాగే అందరూ మాట తప్పుతారని భావిస్తాడు. కానీ జగన్‌ మాట ఇస్తే అమలు చేసి చూపిస్తాడు. చదవండి: ‘పదవి పోయాక బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ’

కరోనా వైరస్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశారు. కార్పొరేట్‌ వ్యవస్థకు దీటుగా విద్య, వైద్య రంగాన్ని తీర్చిదిద్దుతున్నారు. సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు. చరిత్ర గతిని మారుస్తున్న నాయకుడు సీఎం జగన్‌. ఏడాది పాలన, అందించిన సంక్షేమ కార్యక్రమాలపై గత ఐదు రోజులుగా సమీక్షలు జరిపారు. నిపుణలు, లబ్ధిదారులు నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో మరింత అకుంఠిత దీక్షతో పాలన కొనసాగిస్తారని' సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చదవండి: చరిత్ర గతిని మార్చి నవశకాన్ని లిఖించి..

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)