తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు
Breaking News
ఎల్ఐసీ ఉద్యోగుల సంతకాల సేకరణ
Published on Tue, 08/05/2014 - 03:48
కడప కల్చరల్ : ప్రైవేట్ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిరసిస్తూ సోమవారం ఎల్ఐసీ ఉద్యోగులు సంతకాల సేకరణ నిర్వహించారు. స్థానిక ఎల్ఐసీ కడప బ్రాంచి కార్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కడప డివిజన్ ఐసీఈయూ ప్రధాన కార్యదర్శి జెవి శుభశేఖర్ మాట్లాడుతూ ప్రైవేట్ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడానికి ఉద్దేశించిన బీమా నియంత్రణ సవరణ బిల్లు 2008 త్వరలో రాజ్యసభలో ఓటింగ్కు రానుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రస్తుతం ఈ సంతకాల సేకరణ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి కెవి కిరణ్కుమార్, అధ్యక్షులు వి.మధుసూదన్రావు, సభ్యులు కె.పద్మజ, శశికళ, మద్దిలేటి, రాజేష్, వై.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసీ ఏజెంట్ల సంఘం నాయకులు నిత్యానందరెడ్డి, ఏవిఎన్ సుబ్బారెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు.
Tags