Breaking News

ఆగస్టు 13 నుంచి రిషితేశ్వరి కేసు విచారణ ప్రారంభం

Published on Thu, 07/14/2016 - 01:09

దోషులకు శిక్ష పడినప్పుడే  ఆమె ఆత్మకు శాంతి
సీనియర్ న్యాయవాది వైకే

 
గుంటూరు (లక్ష్మీపురం) : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ మహమ్మారికి బలైన ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం. రిషితేశ్వరి కేసులో దోషులకు శిక్ష పడినప్పుడు ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని సీనియర్ న్యాయవాది వై. కోటేశ్వరరావు (వైకే) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సహ విద్యార్థుల అమానుష చర్యల కారణంగా బలవన్మరణానికి పాల్పడి గురువారానికి ఏడాది పూర్తవుతున్న దృష్ట్యా ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బాబూరావుతో సహా మరో ముగ్గురు విద్యార్థులు నిందితులుగా ఉన్న ఆ కేసు విచారణ ప్రక్రియ గుంటూరు 4వ అదనపు అసిస్టెంట్ సెషన్స్ మహిళా న్యాయమూర్తి కమలాదేవి కోర్టులో ఆగస్టు 13 నుంచి ప్రారంభం కానున్నదని వెల్లడించారు. ఈ మేరకు నలుగురు నిందితులు కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారని వివరించారు.


యావజ్జీవ కారాగార శిక్ష పడే ర్యాగింగ్ నిరోధక చట్టం ఐపీసీలోని 306 తదితర సెక్షన్ల కింద కేసు విచారణ జరగనున్నదని తెలిపారు. కేసు విచారణ అసిస్టెంట్ సెషన్సు జడ్జి కాకుండా, సెషన్స్ జడ్జితో చేపట్టాలని కోరుతూ ఫిర్యాదిదారు రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ తరఫున కోర్టులో పిటిషన్ వేసే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. మృతురాలి తండ్రి మురళీకృష్ణ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, ఆర్కిటెక్చర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డిని కలిసి గురువారం రిషితేశ్వరి సంస్మరణను విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ వ్యతిరేక దినంగా నిర్వహించాలని కోరారని తెలిపారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
 
 

Videos

చైనాకు దగ్గరవుతోన్న భారత్? టిక్ టాక్ రీ ఎంట్రీ.. నిషేధంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

7 కోట్ల స్థలం 50 లక్షలకే.. ఆంధ్రజ్యోతికి ఇవ్వాలనుకొని బొక్క బోర్లాపడ్డ టీడీపీ

పాఠశాలలో పిల్ల ఏనుగు

కుక్కలతో మాట్లాడుతున్న రాజేష్

ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. నారా రోహిత్ షాకింగ్ రియాక్షన్

అరుణ నోరు తెరిస్తే బండారం బయటపడుతుందని హోంమంత్రి అనితకు భయం

అమెరికా వీసా ఇమ్మిగ్రేషన్ విధానాలు మరింత కఠినతరం

జేమ్స్ కామెరాన్ చేతిలో SSMB29 ప్రమోషన్స్

అమెరికాలోని పెంబ్రోక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అబ్బయ్య చౌదరిని చంపితే? వెయ్యి మంది అబ్బయ్య చౌదరిలు వస్తారు.. పేర్ని నాని సంచలన కామెంట్స్

Photos

+5

ప్రభాస్ ఫస్ట్‌ హీరోయిన్‌ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)

+5

'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్‌ గ్లింప్స్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా..?

+5

#HBDChiranjeevi : 70 ఏళ్ల గాడ్‌ ఫాదర్‌.. 'చిరంజీవి' బర్త్‌డే స్పెషల్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి శ్రియా శరణ్ (ఫొటోలు)