44 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

Published on Tue, 03/03/2020 - 04:02

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌కు సంబంధించి రైతుల నుంచి ఇప్పటివరకు 44 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు అంశంపై కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రెండవ, మూడవ త్రైమాసికాలకు సంబంధించి ధాన్యం నిధులు విడుదల కాకపోవడం వల్ల చెల్లింపుల్లో స్వల్ప జాప్యం జరిగిందన్నారు.

ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. బ్యాంకులు, నాబార్డ్‌ నుంచి అడ్వాన్సులు తీసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చెల్లింపులు జరపాలని ఆదేశించారని చెప్పారు.  రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను బుధవారం చెల్లిస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ చెప్పారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తప్పుడు వార్తలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.  రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా 1902కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు.

ఏప్రిల్‌ 1నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు
ఉభయ గోదావరి జిల్లాల్లో ఏప్రిల్‌ కు1వ తేదీ నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని కోన శశిధర్‌ చెప్పారు. కృష్ణా జిల్లాలో మినునులు, పెసలు పంట వేయడం వల్ల ధాన్యాన్ని ముందుకు తీసుకురాలేకపోతున్నట్లు రైతులు చెబుతున్నారన్నారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు ఎప్పుడు వీలైతే అప్పుడే ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయించవచ్చన్నారు.

Videos

హిమాచల్‌ ప్రదేశ్ లో అత్యధిక ఓటింగ్ శాతం

ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం

మళ్లీ YSRCPదే.. డా. మునిబాబు గ్రౌండ్ రిపోర్ట్

ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన.. గన్నవరంలో ఘన స్వాగతం

మా పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు ఇక రాకూడదు

ఫోన్ లో ఫోటోలు చూసి షాక్..బయటపడ్డ సంచలన నిజాలు

జయ జయహే తెలంగాణ గీతం ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది ?

జర్ర ఆగరాదే..! చాలా స్మార్ట్‌ గురూ!

గొర్రెల పంపిణీలో 700 కోట్ల భారీ స్కాం

Photos

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..