ప్రయాణికుడిపై చెప్పుతో దాడి చేసిన అధికారిణి ఎందుకంటే..?
Breaking News
పిల్లలు ఉంటేనే వైవాహిక బంధం ఉన్నట్లా..?
Published on Thu, 06/18/2026 - 17:32
పెళ్లైతే పిల్లల్ని కనాల్సిందేనా అనే అంశంపై ఓ 63 ఏళ్ల వ్యక్తి చాలా ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. పెళ్లి అవగానే పిల్లలు కనాలని అందరూ చెబుతుంటారు..కానీ ఇది అందరికీ సరిపడే అంశం కాదంటాడు 63 ఏళ్ల కె.ఎఫ్. ఆయన విలియం రోసీ అనే ఇన్ఫ్లుయెన్సర్తో జరిపిన సంభాషణలో ఈ విషయాలను చెప్పుకొచ్చారు. భార్యభర్తలు పిల్లల్ని కంటే సరిపోదు, దానితోపాటే వచ్చే అపారమైన బాధ్యతను గురించి ఎవ్వరూ ఆలోచించరు, చెప్పరు. అందువల్ల పేరెంట్స్గా విఫలమవుతున్నారని అన్నారు కె.ఎఫ్.
ముప్పైళ్ల దాంపత్య జీవితంలో తాను తను భార్య ఎంతో సంతోషంగా గడిపామని చెప్పుకొచ్చారు. అయితే తాము ఎప్పుడూ పిల్లలను కనాలని అనుకోలేదని తెలిపాడు. తాము ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంచి తల్లిదండ్రులుగా ఉండగలం అనుకుంటేనే పిల్లలను కనాలని అన్నారు. ముందుగా పిల్లలకు జీవితంలోని సవాళ్లు, వాస్తవాలు గురించి నేర్పించాలి, కానీ తల్లిదండ్రులు భౌతిక సంపాదనపైనే దృష్టిపెడుతున్నారని, అందుకే విఫలమవుతున్నారని అన్నారు.
పిల్లల్ని కనడం అంటే.. మంచి ప్రయోజకులుగా తీర్చిద్దిదే బహృత్కార్యంగా అభిర్ణించాడు. అంతేగాదు పిల్లల్నలి పెంచిన విధానమే తల్లిదండ్రుల్ని ప్రతిబింబిస్తుందన్నారు. అలాxo పిల్లలతో పేరెంట్స్ ప్రవర్తించే తీరుని కూడా తప్పుపట్టారు. నాకు లేని సౌకర్యాలు ఇస్తున్నా అనేది చెప్పొద్దు..అవసరానికి మించి డబ్బు ఇవ్వొద్దు, ఇతరుల పట్ల గౌరవంగా మెలిగేలా పెంచండి చాలు అని అన్నాడు. అలా పెంచలేను అనుకుంటే కనొద్దని పరోక్షంగా చెప్పాడు.
అలాగే తమ 30 ఏళ్ల వైవాహిక బంధం గురించి కూడా మాట్లాడారు. ఒకరిపట్ల ఒకరికున్న నమ్మకం, నిబద్ధతతే ఇన్నేళ్లు ఇంతలా కలిసిసాగామని అన్నారు. రోజుకు కనీసం ఒక్కసారైన తనను నవ్వించాలి అనుకుంటా..ఇప్పటికీ ఇంద్దరం ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా ఉంటామని అన్నారు. నెటిజన్లు పిల్లలు ఉంటేనే వైవాహిక బంధం కాదని చెప్పిన తీరు బాగుందని అన్నారు. అలాగే భార్య నవ్వుతూ ఉండేలా చేస్తానన్న మాట బట్టే అతడేంటో తెలుస్తోందంటూ అభినందించారు. పిల్లలను సరిగా పెంచలేకపోవడం కంటే కనకపోవడమే మేలు అన్న ఆయన మాటలకు మద్దతిస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం.
(చదవండి: ‘కంపెనీని నిర్మించాను, మారథాన్ పూర్తి చేశా’! కానీ అమ్మమ్మ..)
Tags : 1