Breaking News

ఊడిన ఉద్యోగికి ఎంత కష్టం!!

Published on Sat, 04/11/2026 - 09:34

ప్రైవేటు రంగంలో పెరుగుతున్న లేఆఫ్స్ కేవలం ఉద్యోగ భద్రతనే కాకుండా, మధ్యతరగతి ఆర్థిక మూలాలను, ముఖ్యంగా ఈఎంఐ (EMI) చెల్లింపుల వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈఎంఐలు అంటే సాధారణ వ్యావహారికంలో సులభ వాయిదాలుగా వ్యవహిరిస్తారు. కానీ ఉద్యోగం కోల్పోయిన వారికి ఇప్పుడవే భూతంగా భయపెడుతున్నాయి. ఈ పరిస్థితిపై తాజా నివేదికలు, విశ్లేషణలతో ప్రత్యేక కథనం..

ఐటీ లేఆఫ్స్.. ఈఎంఐ సంక్షోభం
గత దశాబ్ద కాలంగా భారత ఐటీ రంగం స్థిరమైన ఆదాయానికి, విలాసవంతమైన జీవనశైలికి చిరునామాగా నిలిచింది. అయితే, 2025-26 కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, ప్రపంచ ఆర్థిక మందగమనం కారణంగా ఐటీ కొలువులు ఊడుతున్నాయి. ఇది నేరుగా బ్యాంకింగ్, రుణ చెల్లింపుల రంగంపై ప్రభావం చూపుతోంది.

పెరుగుతున్న గృహ రుణాల ఆందోళన
ఐటీ నిపుణులు ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్, పుణే వంటి నగరాల్లో భారీ ధరలకు ఇళ్లను కొనుగోలు చేశారు. మెట్రో నగరాల్లో సగటు ఐటీ ఉద్యోగి హోమ్ లోన్ ఈఎంఐ రూ.80,000 నుండి రూ.1.2 లక్షల మధ్య ఉంటోంది. ఇటీవల ఒక సర్వే ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన వారిలో 60% మందికి కేవలం 6 నుండి 8 నెలల వరకు మాత్రమే ఈఎంఐలు చెల్లించగల అత్యవసర నిధి (Emergency Fund) ఉంది. ఆ తర్వాత డిఫాల్ట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

భారమైన బకాయిలు
ఆర్బీఐ (RBI) తాజా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (2026) ప్రకారం, భారతదేశ గృహ రుణాలు జీడీపీలో 41% దాటాయి. ఇందులో అధిక భాగం వినియోగ అవసరాల కోసం తీసుకున్న పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలే. ఐటీ నిపుణులు తమ జీవనశైలిని కొనసాగించేందుకు తీసుకున్న అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఇప్పుడు భారంగా మారాయి. ఆదాయం ఆగిపోవడంతో, ఈ రుణాల రికవరీ బ్యాంకులకి సవాలుగా మారుతోంది.

మారిన సిబిల్ నిబంధనలతో తక్షణ ప్రభావం
ఏప్రిల్ 2026 నుండి ఆర్బీఐ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. బ్యాంకులు ఇప్పుడు ప్రతి వారం రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు పంపాలి (గతంలో ఇది 15-30 రోజులకు ఒకసారి ఉండేది). దీంతో ఒక్క ఈఎంఐ మిస్ అయినా, కేవలం 7 రోజుల్లోనే మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. దీనివల్ల ఉద్యోగం కోల్పోయిన వారు ఇతర రుణాల కోసం ప్రయత్నించడం లేదా రీఫైనాన్సింగ్ చేసుకోవడం కష్టతరమవుతోంది.

తాజా నివేదికల ముఖ్యాంశాలు 
బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (NPA) చారిత్రాత్మక కనిష్టంలో (2.15%) ఉన్నప్పటికీ, పర్సనల్ లోన్ విభాగంలో ఒత్తిడి పెరుగుతోంది. గృహ రుణాలు జీడీపీలో 41% కి చేరాయి. ఇది ఆందోళనకర స్థాయి. ఐటీ హబ్‌లలో నివసించే వారిలో పొదుపు శాతం 15% తగ్గింది.  ఐటీ ఉద్యోగుల నుండి రుణ కాలపరిమితి పెంచాలని కోరుతూ వచ్చే దరఖాస్తులు 25% పెరిగాయి.

ఉద్యోగం కోల్పోతే ఏం చేయాలి?
లేఆఫ్స్ జరిగినప్పుడు భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా బ్యాంకులకు ముఖం చాటేయడం అతిపెద్ద తప్పు. రుణదాతలతో సంప్రదింపులు జరిపి మోరటోరియం లేదా లోన్ రీస్ట్రక్చరింగ్ కోరడం ఉత్తమ మార్గమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

అన్నిటా లేఆఫ్‌లు పెరుగుతున్న తరుణంలో ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి ఉద్యోగులు ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. కనీసం 12 నెలల ఈఎంఐలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ నిధిని ముందే సిద్ధం చేసుకోవాలి. మొదట హోమ్ లోన్ వంటి సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే ఆస్తి జప్తు అయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయం తగ్గినప్పుడు వెంటనే విలాసవంతమైన ఖర్చులను నిలిపివేయాలి.

ఐటీ రంగంలో లేఆఫ్స్ అనేవి కేవలం ఒక రంగ సమస్య కాదు, ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని, రుణ చెల్లింపుల చక్రాన్ని ప్రభావితం చేస్తోంది. క్రెడిట్ స్కోర్ పట్ల బ్యాంకులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో, ఐటీ ఉద్యోగులు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది.

Videos

చంద్రబాబు గూటిలో చిలక షర్మిల.. గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కామెంట్స్

సోలార్, ఎలక్ట్రానిక్స్ డిమాండ్ వెండి ధరలకు రెక్కలు..!

జగన్ ను ప్రశ్నించే హక్కు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు..

10 కోట్లు స్కామ్.. పంజాగుట్టలో సింగర్ మంగ్లీపై కేసు

పెద్దిలో స్పెషల్ సాంగ్..?

Allu Arjun : 175 కోట్లు రెమ్యూనరేషన్..?

కాంగ్రెస్ లో TDP నేతలు.. జీవన్ రెడ్డికి పొగ బెట్టారా?

ఈ పనికిమాలినోడు అలా చేశాడని, మనం టెంపుల్స్ జోలికి పోతామ?

రాజధాని హైదరాబాద్ లో కట్టుకుందాం మీకు సౌకర్యంగా ఉంటది రాచమల్లు సెటైర్లు

భారీగా పడిపోతున్న బంగారం ధరలు

Photos

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)