Breaking News

ఏప్రిల్‌ నుంచి ఇక ఉద్యోగాల జాతరే..

Published on Thu, 03/26/2026 - 08:14

ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి అర్ధభాగంలో ఉపాధి ఊపందుకోనున్నట్లు టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ ప్రాజెక్ట్స్‌ నివేదిక పేర్కొంది. ఏప్రిల్‌–సెప్టెంబర్‌ కాలంలో ఉద్యోగాలు 4.7 శాతం పెరగనున్నట్లు అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ఈకామర్స్, టెక్‌ స్టార్టప్స్, హెల్త్‌కేర్, ఫార్మా, తయారీ(మ్యాన్యుఫాక్చరింగ్‌) రంగాలు ఊతమివ్వనున్నట్లు ఎంప్లాయ్‌మెంట్‌ ఔట్‌లుక్‌ రిపోర్ట్‌ పేరుతో విడుదల చేసిన నివేదికలో టీమ్‌లీజ్‌ తెలియజేసింది.

భారీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఉపాధి కల్పన కనిపించనున్నట్లు తెలియజేసింది. వీటిలో 74 సంస్థలు విస్తరణ చేపట్టే సంకేతాలిచ్చినట్లు పేర్కొంది. మధ్యస్థాయి సంస్థలు 57 శాతం, చిన్న బిజినెస్‌లు 38 శాతం విస్తరణ యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. వెరసి విస్తరణ ద్వారా ఉపాధి కల్పన విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఇటు డిజిటల్, అటు కీలక ఆర్థికవ్యవస్థ సంబంధిత పరిశ్రమల నుంచి ఉద్యోగాలకు డిమాండ్‌ ఏర్పడనున్నట్లు పేర్కొంది. ఎకానమీ వృద్ధికి కీలకంగా నిలిచే రంగాలలో విద్యుత్, స్టీల్, చమురు గ్యాస్, సిమెంట్, ఎరువులు, రిఫైనరీ ప్రొడక్టులు తదితరాలున్నాయి.  

8.9 శాతం ఎన్‌ఈసీ 
అత్యధికంగా ఈకామర్స్, టెక్‌ స్టార్టప్‌లు 8.9 శాతం నికర ఎంప్లాయ్‌మెంట్‌ చేంజ్‌(ఎన్‌ఈసీ)కు కారణంకానున్నట్లు టీమ్‌లీజ్‌ నివేదిక తెలియజేసింది. ఈ బాటలో ఫార్మాస్యూటికల్స్‌ 7 శాతం, తయారీ, ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాలు 6.6 శాతం ఎన్‌ఈసీ సాధించనున్నట్లు అంచనా వేసింది. వెరసి వచ్చే ఏడాది తొలి ఆరు నెలల్లో 4.7 శాతం ఎన్‌ఈసీ నమోదుకానున్నట్లు అభిప్రాయపడింది. నివేదికను 20 నగరాల నుంచి 23 రంగాలకు చెందిన 1,268 సంస్థల(ఎంప్లాయర్స్‌) అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా రూపొందించింది.

ఇందుకు 2025 నవంబర్‌ నుంచి 2026 జనవరి కాలంలో సర్వే చేపట్టింది. దేశీయంగా మానవవనరుల పరిస్థితులు సైక్లికల్‌ డిమాండ్‌ను అనుసరించడంకాకుండా వ్యవస్థాగత, విధానపరమైన అంశాల ఆధారంగా మా ర్పులకు లోనవుతున్నట్లు వివరించింది. కాగా.. శ్రామిక చట్టాల అమలు కారణంగా ఉద్యోగ వ్య యాలు 80% పెరగనున్నట్లు 64 సంస్థలు తెలియజేశాయని, వేతన వ్యవస్థను పునర్‌నిర్వచించడం ప్రభావం చూపనున్నట్లు టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ వైస్‌ప్రెసిడెంట్‌ బాలసుబ్రమణ్యన్‌ పేర్కొన్నారు.

Videos

బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

అడ్డంగా నరికేస్తా.. యూజ్ లెస్ ఫెలో ఆదిరెడ్డికి ధమ్కీ ఇచ్చిన వ్యాపారి

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.

ఇన్వెస్టర్లకు జాక్పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ

ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

YS జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

అమరావతిలో బాబు అవినీతి యజ్ఞం

4 గంటల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి..

దొరకాలి నా కొడుకు.. పెట్రోల్ పోసి తగలబెడతా

Photos

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)

+5

ఇదేం బిల్డప్‌ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)